IND vs SL: భారత్పై శ్రీలంక విజయం..
టీమ్ఇండియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గబ్బర్సేన నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 39 ఓవర్లలో ఛేదించింది...
2-1 తేడాతో గబ్బర్సేన సిరీస్ కైవసం..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గబ్బర్సేన నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 39 ఓవర్లలో ఛేదించింది. దాంతో మూడు వన్డేల సిరీస్ను శ్రీలంక 1-2 తేడాతో కోల్పోయింది. అంతకుముందు భారత్ తొలి రెండు వన్డేలు గెలుపొందడంతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఏడు వికెట్లు కోల్పోయి ఉత్కంఠ పరిస్థితుల్లో విజయం సాధించింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(76; 98 బంతుల్లో 4x4, 1x6), వన్డౌన్ బ్యాట్స్మన్ భానుక రాజపక్స(65; 56 బంతుల్లో 12x4) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ రెండో వికెట్కు 109 పరుగులు జోడించి లంక విజయానికి బలమైన పునాది వేశారు. తర్వాత చారిత్ అసలంక (24; 28 బంతుల్లో 3x4), రమేశ్ మెండిస్(15 నాటౌట్; 18 బంతుల్లో 1x4) వీలైనన్ని పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చడంలో తమవంతు పాత్ర పోషించారు. భారత బౌలర్లలో రాహుల్ చాహర్ మూడు, చేతన్ సకారియా రెండు వికెట్లు తీయగా హార్దిక్, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ పడగొట్టారు.
ఇక తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 225 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శిఖర్ ధావన్(13) త్వరగా పెవిలియన్ చేరినా పృథ్వీషా(49; 49 బంతుల్లో 8x4), వన్డౌన్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ (46; 46 బంతుల్లో 5x4, 1x6) నిలకడగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్కు 74 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే అర్ధశతకాలకు ముందు స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. అప్పటికి భారత్ స్కోర్ 118/3గా నమోదైంది. తర్వాత సూర్యకుమార్(40; 37 బంతుల్లో 7x4), మనీశ్ పాండే (11; 19 బంతుల్లో) ఆదుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. 23 ఓవర్ల తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్కు అంతరాయం కలిగింది. దాంతో సుమారు 45 నిమిషాలు పాటు ఆట నిలిచిపోయింది. ఈ క్రమంలోనే మ్యాచ్ను డక్వర్త్లూయిస్ పద్ధతిలో 47 ఓవర్లకు కుదించారు.
మరోవైపు మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక లంక బౌలర్లు చెలరేగిపోయారు. భారత బ్యాట్స్మెన్ను కుదురుకోనివ్వలేదు. వరుస క్రమంలో వికెట్లు తీశారు. 38 పరుగుల తేడాతో ఐదు వికెట్లు పడగొట్టి భారత్ను కోలుకోలేని దెబ్బ తీశారు. దాంతో టీమ్ఇండియా 32.5 ఓవర్లకే 195/8 స్కోర్తో నిలిచింది. మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య (19), సూర్యకుమార్ యాదవ్, కృష్ణప్ప గౌతమ్ (2), నితీశ్ రాణా (7) వరుసగా ఔటయ్యారు. అయితే, 34వ ఓవర్ నుంచి బ్యాటింగ్ కొనసాగించిన రాహుల్ చాహర్ (13), నవ్దీప్ సైని (15) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ తొమ్మిదో వికెట్కు 29 పరుగులు జోడించి భారత్కు మోస్తరు స్కోర్ అందించారు. చివరికి 42, 43 ఓవర్లలో ఒకరి తర్వాత ఒకరు ఔటవ్వడంతో టీమ్ఇండియా ఇన్నింగ్స్కు తెరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.