Ravi Shastri : రంజీ ట్రోఫీని విస్మరించొద్దు.. అది భారత క్రికెట్కు వెన్నెముకలాంటిది : రవిశాస్త్రి
రంజీ ట్రోఫీని విస్మరిస్తే.. భారత క్రికెట్కు వెన్నెముక లేకుండా పోతుందని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. దేశవాళీ క్రికెట్ ద్వారానే నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి వస్తారని పేర్కొన్నాడు. అతడు ఈ...
ఇంటర్నెట్ డెస్క్ : రంజీ ట్రోఫీని విస్మరిస్తే.. భారత క్రికెట్కు వెన్నెముక లేకుండా పోతుందని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. దేశవాళీ క్రికెట్ ద్వారానే నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి వస్తారని పేర్కొన్నాడు. అతడు ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే.. రెండు దశల్లో రంజీ ట్రోఫీని నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించడం గమనార్హం.
‘భారత క్రికెట్కు రంజీ ట్రోఫీ వెన్నెముక లాంటిది. దాన్ని విస్మరిస్తే మన క్రికెట్ దిక్కులేనిదవుతుంది’ అని రవిశాస్త్రి ట్వీట్ చేశారు. శాస్త్రి ట్వీట్ చేసిన కొద్ది సేపటికే బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ‘రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మొదటి విడతలో లీగ్ దశ మ్యాచ్లను పూర్తి చేస్తాం. నాకౌట్ మ్యాచ్లను జూన్లో నిర్వహిస్తాం’ అని ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ తాజా నిర్ణయంతో ఫిబ్రవరి రెండో వారంలో రంజీ ట్రోఫీ మొదటి విడత ప్రారంభం కానునట్లు తెలుస్తోంది. మార్చి 27 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీని ఒకే దశలో నిర్వహించడం కష్టం. అందుకే రెండు దశల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జై షా తదితరులు పాల్గొన్న బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 13 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, కరోనా థర్డ్ వేవ్ కారణంగా బీసీసీఐ ట్రోఫీని నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా