స్పిన్ మాయ: ఇంగ్లాండ్ 81 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. స్విన్ ద్వయం అక్షర్ పటేల్ (5/32), అశ్విన్ (4/48) మరోసారి ఆ జట్టును ఘోరంగా దెబ్బకొట్టారు. ప్రత్యర్థిని 81 పరుగులకే ఆలౌట్ చేశారు. దాంతో ఇంగ్లిష్ జట్టు కోహ్లీసేన ముందు...
భారత్ విజయ లక్ష్యం 49
(Pic: BCCI)
అహ్మదాబాద్: ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. స్పిన్ ద్వయం అక్షర్ పటేల్ (5/32), అశ్విన్ (4/48) మరోసారి ఆ జట్టును ఘోరంగా దెబ్బకొట్టారు. ప్రత్యర్థిని 81 పరుగులకే ఆలౌట్ చేశారు. దాంతో ఇంగ్లిష్ జట్టు కోహ్లీసేన ముందు 49 పరుగుల విజయ లక్ష్యమే ఉంచగలిగింది. బెన్స్టోక్స్ (25; 34 బంతుల్లో 3×4), జో రూట్ (19; 45 బంతుల్లో) మినహా ప్రత్యర్థి జట్టులో మరెవ్వరూ రాణించలేకపోయారు.
మళ్లీ అక్షరే
తొలి ఇన్నింగ్స్లో భారత్ను త్వరగానే ఔట్ చేసిన ఆనందం ఇంగ్లాండ్కు ఎక్కువసేపు దక్కలేదు. పరుగుల ఖాతా ఆరంభించకముందే ఓపెనర్ జాక్ క్రాలీ (0), వన్డౌన్ ఆటగాడు జానీ బెయిర్ స్టో (0)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపు క్రీజులో నిలిచిన డొమినిక్ సిబ్లీ (7; 25 బంతుల్లో)నీ అతడే పెవిలియన్ పంపించి 19/3తోఆంగ్లేయులపై తీవ్ర ఒత్తిడి పెంచాడు.
స్పిన్నర్లకే 10 వికెట్లు
వెంటవెంటనే మూడు వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లాండ్ను కెప్టెన్ జో రూట్ (19)తో కలిసి బెన్స్టోక్స్ (25) ఆదుకొనే ప్రయత్నం చేశాడు. దూకుడుగా రెండు బౌండరీలు బాదాడు. ప్రమాదకరంగా మారేలా కనిపించిన ఆ జోడీని జట్టు స్కోరు 50 వద్ద స్టోక్స్ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ విడదీశాడు. ఇక 56 వద్ద రూట్ను ఔట్ చేసి ఒక టెస్టులో 10 వికెట్ల ఘనత అందుకున్నాడు. మరికాసేపటికే ఒలీ పోప్ (12)ను యాష్ క్లీన్బౌల్డ్ చేశాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 66/6. ఇక టెయిలెండర్లు ఎంతో సేపు నిలవలేదు. జోఫ్రా ఆర్చర్ (0), జాక్ లీచ్ (9; 22 బంతుల్లో 1×6)ను అశ్విన్ పెవిలియన్ పంపించాడు. బెన్ఫోక్స్ (8; 28 బంతుల్లో)ను అక్షర్, అండర్సన్ (0)ను సుందర్ ఔట్ చేసి ఇంగ్లాండ్ను 81కి పరిమితం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం