‘పింక్’ మాయాజాలం: తొలిరోజు టీమ్ఇండియాదే
మొతెరాలో టీమ్ఇండియా అద్భుతం చేసింది. గులాబి బంతితో మాయ చేసింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో అదరగొట్టింది. డే/నైట్ టెస్టు తొలిరోజే మ్యాచ్పై పట్టు బిగించేసింది. ఇంగ్లాండ్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. మధ్యాహ్నం బ్యాటింగ్ ఆరంభించిన ఆంగ్లేయులను అక్షర్ (6/38), అశ్విన్ (3/26)....
బంతితో అక్షర్.. బ్యాటుతో రోహిత్ మెరుపులు
(Images:BCCI)
అహ్మదాబాద్: మొతెరాలో టీమ్ఇండియా అద్భుతం చేసింది. గులాబి బంతితో మాయ చేసింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో అదరగొట్టింది. డే/నైట్ టెస్టు తొలిరోజే మ్యాచ్పై పట్టు బిగించేసింది. ఇంగ్లాండ్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. మధ్యాహ్నం బ్యాటింగ్ ఆరంభించిన ఆంగ్లేయులను అక్షర్ (6/38), అశ్విన్ (3/26) సాయంత్రానికే ఆలౌట్ చేశారు. ఇక రాత్రయ్యే సరికి ప్రత్యర్థి జట్టు స్కోరు 112కు బదులుగా రోహిత్ శర్మ (57 బ్యాటింగ్; 82 బంతుల్లో 9×4), విరాట్ కోహ్లీ (27; 58 బంతుల్లో 3×4) జట్టును 99/3తో నిలిపారు. అజింక్య రహానె (1 బ్యాటింగ్; 3 బంతుల్లో) క్రీజులో ఉన్నాడు. ఇక రెండో రోజు కోహ్లీసేనలో ఏ ఇద్దరు నిలిచినా మ్యాచ్ ఏకపక్షం కావడం ఖాయం!
సొగసరి ‘హిట్’మ్యాన్
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు శుభారంభమే అందించారు. మనోహరమైన మొతెరాలో రోహిత్ శర్మ చూడచక్కని షాట్లతో అలరించాడు. స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ కట్టుదిట్టంగా విసిరిన బంతుల్ని సమయోచితంగా అడ్డుకున్నాడు. అతడికి తోడుగా మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (11; 51 బంతుల్లో 2×4) ఫర్వాలేదనిపించాడు. అయితే జట్టు స్కోరు 33 వద్ద అతడిని ఆర్చర్ ఔట్ చేశాడు. షార్ట్పిచ్లో విసిరిన బంతిని పుల్ చేయిబోయిన గిల్.. క్రాలీకి క్యాచ్ ఇచ్చాడు. మరో పరుగు వ్యవధిలోనే చెతేశ్వర్ పుజారా (0; 4 బంతుల్లో) అనూహ్యంగా లీచ్ బౌలింగ్లో డకౌట్ కావడం షాకిచ్చింది.
ఈ క్రమంలో విరాట్తో కలిసిన హిట్మ్యాన్ అద్భుతంగా ఆడాడు. అందివచ్చిన బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించాడు. సొగసైన పుల్, కవర్ షాట్లతో అలరించాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇక తొలిరోజు విజయవంతంగా ముగిసిందని భావించేలోగా ఆఖరి ఓవర్ రెండో బంతికి కోహ్లీని లీచ్ పెవిలియన్ పంపించాడు. అప్పటికి స్కోరు 98. క్రీజులోకి వచ్చిన అజింక్య రహానె మిగిలిన బంతుల్ని ఆడి పరుగు తీసి భారత్ను 99/3తో నిలిపాడు. కోహ్లీసేన ఇంకా 13 పరుగుల లోటుతో ఉంది.
తిప్పేసిన అక్షర్, యాష్
అంతకు ముందు టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ను అక్షర్ పటేల్, అశ్విన్ భారీ దెబ్బకొట్టారు. తొలిరోజు నుంచే స్పిన్ను అనుకూలించిన పిచ్ను ఉపయోగించుకొని ప్రత్యర్థిని విలవిల్లాడించారు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ జట్టు స్కోరు రెండు పరుగుల వద్దే ఇంగ్లాండ్ ఓపెనర్ డామ్ సిబ్లి (0)ని పెవిలియన్ పంపించి టీమ్ఇండియాకు శుభారంభం అందించాడు. ఇది లంబూ కెరీర్లో వందో టెస్టు కావడం విశేషం. వేగంగా ఆడుతున్న మరో ఓపెనర్ జాక్ క్రాలీ (53; 84 బంతుల్లో 10×4)కి అండగా నిలిచిన జానీ బెయిర్స్టోను అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకొని రెండో వికెట్ పడగొట్టాడు. అయితే కెప్టెన్ జో రూట్ (17; 37 బంతుల్లో)తో కలిసి క్రాలీ మూడో వికెట్కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఇంగ్లాండ్ విలవిల
ఇంగ్లాండ్ ఆటగాళ్లు నిలదొక్కుకుంటున్న సమయంలో అశ్విన్ తెలివైన ఎత్తుగడతో జోరూట్ను పెవిలియన్కు పంపించాడు. ఫుల్లర్ లెంగ్త్ బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్నాడు. రూట్ సమీక్ష కోరినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడు స్కోరు 74/3. మరికాసేపటికే అర్ధశతక వీరుడు జాక్ క్రాలీని అక్షర్ పటేల్ బోల్తా కొట్టించడంతో ఇంగ్లాండ్ 81/4తో భోజన విరామానికి వెళ్లింది. ఆ తర్వాత అక్షర్ అద్భుతం చేశాడు. సొంతమైదానంలో ఆడుతున్న అతడు తన అనుభవాన్ని ఉపయోగించుకున్నాడు. భిన్నమైన కోణాల్లో బంతులు విసురుతూ ఇంగ్లాండ్ ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీశాడు. బెన్స్టోక్స్ (6), బెన్ఫోక్స్ (12), జోఫ్రా ఆర్చర్ (11), స్టువర్ట్ బ్రాడ్ (3)ను పెవిలియన్కు పంపించి వరుసగా రెండో టెస్టులో ‘5+’ వికెట్ల ఘనత అందుకున్నాడు. అతడి ధాటికి ఆంగ్లేయులు వందలోపే చాపచుట్టేస్తారనిపించింది. మరోవైపు ఒలీ పోప్ (1), జాక్లీచ్ (3)ను యాష్ ఔట్ చేశాడు. తొలిరోజే తమకు అనుకూలించిన పిచ్ను ఉపయోగించుకొన్న స్పిన్నర్లు 9 వికెట్లు తీసి ఇంగ్లాండ్ను 112కు పరిమితం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM