IPL 2021: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మలి దశలో దుబాయి వేదికగా మూడో మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈ మ్యాచ్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్..రాజస్థాన్ని
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మలి దశలో దుబాయి వేదికగా మూడో మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈ మ్యాచ్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్..రాజస్థాన్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్.. ఏడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ దృష్ట్యా.. ఇరు జట్లలోని పలువురు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్కు దూరమైన విషయం తెలిసిందే. రాజస్థాన్ తరఫున ఆడుతున్న జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై, జోఫ్రా ఆర్చర్ వంటి కీలక ఆటగాళ్లు ఐపీఎల్కు దూరమవడం ఆ జట్టుకు ప్రతికూలాంశం. అలాగే, పంజాబ్ కింగ్స్ హిట్టర్ డేవిడ్ మలన్తో పాటు మరికొందరు దూరమయ్యారు. వీరి స్థానాల్లో కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
పంజాబ్ కింగ్స్ జట్టు..
కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, ఆడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, అదిల్ రషీద్, అలెన్, రవి బిష్ణోయ్, హర్ప్రీత్బ్రర్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ పొరెల్, మహమ్మద్ షమి
రాజస్థాన్ రాయల్స్ జట్టు..
ఎవిన్ లెవిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, రియాన్ పరాగ్, లివింగ్ స్టోన్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, కార్తిక్ త్యాగి, ముస్తాఫిజుర్ రహ్మన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.