IPL 2021: RCB vs CSK ప్రివ్యూ.. ధీమాతో చెన్నై.. ఆశతో బెంగళూరు
ఐపీఎల్ 14వ సీజన్లోని రెండో దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల బాట పట్టాలని చూస్తోంది. ఇప్పటికే సోమవారం కోల్కతాతో చావుదెబ్బ తిన్న...
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్లోని రెండో దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల బాట పట్టాలని చూస్తోంది. ఇప్పటికే సోమవారం కోల్కతాతో చావుదెబ్బ తిన్న ఆ జట్టు ఈరోజు ఎలాగైనా చెన్నైని ఓడించి మళ్లీ పాయింట్ల పట్టికలో ముందుకు రావాలని పట్టుదలగా ఉంది. మరోవైపు చెన్నై ముంబయితో తలపడిన సందర్భంగా అనూహ్య విజయం సాధించి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాల గురించి తెలుసుకుందాం.
కోహ్లీ, డివిలియర్స్, మాక్సీ చెలరేగాలి..
కోల్కతాతో మ్యాచ్లో బెంగళూరు 92 పరుగులకే కుప్పకూలి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, దేవ్దత్ పడిక్కల్తో సహా తర్వాత వచ్చే ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్ లాంటి కీలక ఆటగాళ్లు పూర్తిగా తేలిపోయారు. తొలి భాగంలో అదరగొట్టిన వీరంతా ఇకపై జట్టు ముందుకు సాగాలంటే బ్యాట్లకు పనిచెప్పక తప్పదు. మరోవైపు శ్రీకర్ భరత్, సచిన్ బేబీ లాంటి యువ బ్యాట్స్మెన్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే కోల్కతాతో జరిగిన మ్యాచ్ను వీళ్లంతా మర్చిపోవాలి. సిరాజ్, హర్షల్ పటేల్ కాస్త ఫర్వాలేదనిపించినా మిగతా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కైల్ జేమీసన్, యుజువేంద్ర చాహల్, వానిండు హసరంగా పదికిపైగా ఎకానమీతో చతికిల పడ్డారు.
రైనా, డుప్లెసిస్, మొయిన్ అలీ దంచికొట్టాలి..
మరోవైపు టాప్లో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ది మరో పరిస్థితి. ముంబయితో ఆడిన గత మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్(88) పుణ్యమా అని గెలిచింది. లేదంటే బెంగళూరు పరిస్థితే ఎదురయ్యేది. తొలి సీజన్లో మంచి ఫామ్లో కనిపించిన డుప్లెసిస్, ఆల్రౌండర్ మొయిన్ అలీ, ధోనీ, సురేశ్ రైనా లాంటి ప్రధాన బ్యాట్స్మెన్ అంతా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే జడేజా, బ్రావోతో కలిసి రుతురాజ్ జట్టుకు మంచి స్కోర్ అందించాడు. అనంతరం దీపక్ చాహర్ నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ ముంబయిని 136 పరుగులకే కట్టడి చేసింది. దీంతో ఈ జట్టు టాప్లోకి వెళ్లింది. కాగా, ఈరోజు బెంగళూరుతో జరిగే మ్యాచ్లోనూ చెన్నై బౌలర్లు ఇలాగే చెలరేగితే కోహ్లీసేనకు కష్టాలు తప్పకపోవచ్చు.
ఏదేమైనా రెండు జట్లలోని ప్రధాన బ్యాట్స్మెన్ రాణించాల్సిన అవసరం ఉంది. ఎవరు ఆడకపోయినా ఆ జట్టు కష్టాల్లో పడే అవకాశమూ లేకపోలేదు. కాగా, చెన్నై ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతుండగా ఈ మ్యాచ్లో విజయం సాధించి మళ్లీ టాప్లోకి వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు బెంగళూరు ఈరోజు గెలుపొంది తొలి సీజన్ మాదిరే ముందుకు సాగాలని పట్టుదలగా ఉంది.
జట్ల అంచనా:
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, సచిన్ బేబీ, భరత్, వానిండు హసరంగ, యుజువేంద్ర చాహల్, కైల్ జేమీసన్, హర్షల్ పటేల్, సిరాజ్
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, ధోనీ (కెప్టెన్) శార్దూల్ ఠాకూర్, హేజిల్వుడ్, దీపక్ చాహర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి