Virat:కోహ్లీ అతడి బౌలింగ్లో తడబడుతున్నాడు:ఇర్ఫాన్ పఠాన్
ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్బౌలర్ మిచెల్ జాన్సన్ భీకర బౌలింగ్ను ఎదుర్కొవడంలో ఎప్పుడూ కంగారు పడని విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు మాత్రం తడబడుతున్నాడని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్
(photo:Virat Kohli Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్బౌలర్ మిచెల్ జాన్సన్ భీకర బౌలింగ్ను ఎదుర్కొవడంలో ఎప్పుడూ కంగారు పడని విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు మాత్రం తడబడుతున్నాడని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలోని ఏ బ్యాట్స్మన్ కూడా స్వింగ్ బౌలింగ్లో సౌకర్యంగా బ్యాటింగ్ చేయలేడని, స్వింగ్ అవుతున్న బంతిని అంచనా వేయడం కష్టమని అని ఇర్ఫాన్ అన్నాడు.
‘పాట్ కమిన్స్, జోఫ్రా అర్చర్ బౌలింగ్లో రిషభ్ పంత్, జోస్ బట్లర్ ల్యాప్ షాట్(వికెట్ల వెనుకకు బాదడం),రివర్స్ స్వీప్స్ షాట్లు ఆడటం మనం చూశాం. వేగంగా మాత్రమే బౌలింగ్ చేసి విజయవంతం కాలేం ఎందుకంటే బ్యాట్స్మెన్ ఎల్లప్పుడూ పేస్కి భయపడరు. మీరు రాణించాలంటే నైపుణ్యం తప్పనిసరి. స్వింగ్ అనేది గొప్ప కళ’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
2014లో భారత జట్టు ఇంగ్లాండ్లో పర్యటించింది. ఆ సిరీస్లో కోహ్లీ అండర్సన్ బౌలింగ్లో నాలుగుసార్లు ఔటవ్వడమే కాకుండా 10 ఇన్నింగ్స్ల్లో కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. ఆగస్టులో టీమ్ఇండియా ఇంగ్లాండ్తో ఐదు టెస్టులు ఆడనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇర్ఫాన్ ఈ విధంగా స్పందించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.