ఔరా ఇషాంత్! త్రిశతకం చేసేశాడు
టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు కెరీర్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత అందుకున్న ఆరో బౌలర్గా, మూడో పేసర్గా చరిత్ర సృష్టించాడు. దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, జహీర్ ఖాన్ సరసన నిలిచాడు....
కపిల్, జహీర్ సరసన చేరిన మూడో పేసర్
చెన్నై: టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఇషాంత్శర్మ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు కెరీర్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత అందుకున్న ఆరో బౌలర్గా, మూడో పేసర్గా చరిత్ర సృష్టించాడు. దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, జహీర్ ఖాన్ సరసన నిలిచాడు.
చెపాక్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో డాన్ లారెన్స్ను ఇషాంత్ ఔట్ చేశాడు. ఓ చక్కని బంతితో అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని 300వ వికెట్ సాధించాడు. ఇందుకోసం అతడు 98 మ్యాచులు ఆడటం గమనార్హం. అతడి కన్నా ముందు అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), రవిచంద్రన్ అశ్విన్ (377; ఈ మ్యాచుకు ముందు), హర్భజన్ సింగ్ (417), జహీర్ ఖాన్ (311) త్రిశతక మైలురాయిని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఇషాంత్కు బీసీసీఐ, ఐసీసీ అభినందనలు తెలియజేసింది. ‘ఇషాంత్ శర్మకు అభినందనలు. టెస్టు క్రికెట్లో 300 వికెట్లు తీసిన భారత మూడో పేసర్గా అతడు రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ మూడో వికెట్ లారెన్స్ను ఎల్బీడబ్ల్యూ చేసి ఈ ఘనత సాధించాడు’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తర్వాత 300 వికెట్లు తీసిన భారత మూడో పేసర్గా ఇషాంత్ నిలిచాడు. గొప్ప విజయమిది’ అని ఐసీసీ ట్వీటింది.
బంగ్లాదేశ్పై 2007లో అరంగేట్రం చేసిన ఇషాంత్ ఇప్పటి వరకు 11 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఒక మ్యాచులో పది వికెట్లు పడగొట్టాడు. 13 ఏళ్లుగా అతడు టీమ్ఇండియాకు సేవలు అందిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అతడి బౌలింగ్లో పస తగ్గడంతో మళ్లీ వైవిధ్యం పెంచుకొని కీలకంగా మారాడు.
ఇషాంత్ యువకుడిగా ఉన్నప్పుడు ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్కు వేసిన బౌలింగ్ స్పెల్ గురించి ఇప్పటికీ చర్చించుకుంటారు. లంబూ 98 మ్యాచుల్లో ఈ ఘనత సాధిస్తే అశ్విన్ 54, కుంబ్లే 66, హర్భజన్ 72, కపిల్ 83, జహీర్ 89 మ్యాచుల్లో సాధించారు.
ఇవీ చదవండి
కోహ్లీ 1 లేదా 2 సెంచరీలు కొడతాడు
ఉత్తరాఖండ్ బాధితుల కోసం పంత్ ముందడుగు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!