ఆ విజయం ప్రపంచకప్తో సమానం: ఇషాంత్
టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ తన కెరీర్లో మరో గొప్ప మైలురాయిని అందుకోనున్నాడు. కపిల్దేవ్ తర్వాత 100 టెస్టులకు ప్రాతినిధ్యం వహించిన భారత పేసర్గా నిలవడానికి మరో మ్యాచ్ దూరంలో...
ఇంటర్నెట్డెస్క్: టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ తన కెరీర్లో మరో గొప్ప మైలురాయిని అందుకోనున్నాడు. కపిల్దేవ్ తర్వాత 100 టెస్టులకు ప్రాతినిధ్యం వహించిన భారత పేసర్గా నిలవడానికి మరో మ్యాచ్ దూరంలో ఉన్నాడు. బుధవారం జరగనున్న ఇంగ్లాండ్తో జరిగే డే/నైట్ టెస్టులో లంబూ ఈ ఘనత సాధించడం దాదాపు ఖరారే. అయితే తానెప్పుడూ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడనని, జట్టు విజయాల కోసమే పోరాడతానని అన్నాడు.
భారత కెప్టెన్లందరూ తనని గొప్పగా అర్థంచేసుకున్నారని పేర్కొన్నాడు. సారథి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకుంటే బౌలర్గా తమ పనిని సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని తెలిపాడు. వైట్బాల్ క్రికెట్ ఆడలేకపోవడం వల్ల సుదీర్ఘ ఫార్మాట్లలో త్వరగా మైలురాళ్లను సాధిస్తున్నానన్నాడు. దాని అర్థం పరిమిత ఓవర్లపై ఆసక్తి లేనట్లు కాదని అన్నాడు. సమయం దొరకడంతో తన ఆటపై మరింత శ్రద్ధ వహించానని చెప్పాడు. 99 టెస్టుల్లో ఇషాంత్ 302 వికెట్లు సాధించిన విషయం తెలిసిందే.
కపిల్దేవ్ 131 టెస్టుల రికార్డును అధిగమించాలనే ఆలోచన లేదని, ప్రస్తుతం తన దృష్టంతా టెస్టు ఛాంపియన్షిప్పైనే ఉందని ఇషాంత్ శర్మ తెలిపాడు. టెస్టు ఛాంపియన్షిప్ విజయం తనకి ప్రపంచకప్తో సమానమని చెప్పాడు. వయసు పెరిగే కొద్ది ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయాలంటే దానికి తగ్గట్లుగా శరీరాన్ని సన్నద్ధం చేసుకోవాలని వెల్లడించాడు. గాయాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నానని అన్నాడు. భారత జట్టుకు ఎంపికయ్యే ప్రతి బౌలర్ గొప్ప సామర్థ్యం ఉన్న ఆటగాడేనన్నాడు. అయితే బుమ్రా సమర్థవంతంగా పేస్ దళాన్ని నడిపిస్తాడని ఇషాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే యువపేసర్లను ప్రోత్సహిస్తూ రాణించాలని సూచించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.