Rohit-Rahul: ఓపెనింగ్ వాళ్లిద్దరే చేయాలి : ఆకాశ్ చోప్రా
టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్లనే కొనసాగించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. జట్టులోకి ఎక్కువ మంది ఓపెనర్లను తీసుకోవడం వల్ల గందరగోళం ఏర్పడుతుందని
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్లనే కొనసాగించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. జట్టులోకి ఎక్కువ మంది ఓపెనర్లను తీసుకోవడం వల్ల గందరగోళం ఏర్పడుతుందని అన్నాడు. ‘ప్రస్తుతం భారత క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్లను కొనసాగించాలి. తుదిజట్టులోకి ఐదారు మందిని ఓపెనర్లుగా తీసుకుంటే ఓపెనింగ్ చేసే విషయంలో కొంత గందరగోళం ఎదురవుతుంది. సూర్యకుమార్ యాదవ్ని మూడో స్థానంలో ఆడించాలి. ఆ స్థానంలో అతడు మెరుగ్గా రాణిస్తున్నాడు. అతడిలో రిస్క్ తీసుకునే గొప్ప లక్షణముంది. టీ20 క్రికెట్లో రిస్క్ తీసుకోకపోతే రాణించలేం. అతడిని అలాగే కొనసాగించాలి’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్ కోసం 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఐదు మంది ఓపెనర్లున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్తో పాటు, యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్లకు అవకాశమిచ్చారు. బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్లను రిజర్వ్ బెంచ్కే పరిమితం చేసినా.. ఆల్ రౌండర్గా వెంకటేశ్ అయ్యర్ని తుది జట్టులోకి తీసుకున్నారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.