ఆ పతకాలు ‘సగం రజతం.. సగం కాంస్యం’
నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్ క్రీడల్లో పతకాల కోసం అనేక దేశాలు పోటీ పడుతుంటాయి. ఎంతమంది క్రీడాకారులు పోటీ పడ్డా కేవలం మొదటి ముగ్గురు వ్యక్తులకే స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇస్తారు. కానీ, గతంలో జరిగిన ఓ ఒలింపిక్ క్రీడల్లో జపాన్కి చెందిన ఇద్దరు క్రీడాకారులకు
(ఫొటో: ఒలింపిక్ ఫేస్బుక్ వీడియో స్క్రీన్షాట్)
ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్ క్రీడల్లో పతకాల కోసం అనేక దేశాలు పోటీ పడుతుంటాయి. ఎంతమంది క్రీడాకారులు పోటీ పడ్డా కేవలం మొదటి ముగ్గురు వ్యక్తులకే స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇస్తారు. కానీ, గతంలో జరిగిన ఓ ఒలింపిక్ క్రీడల్లో జపాన్కి చెందిన ఇద్దరు క్రీడాకారులకు రజత, కాంస్య పతకాలను సగం-సగం చేసి ఇవ్వడంతో ఇద్దరికీ రజత-కాంస్య పతకాలు దక్కాయి. విచిత్రంగా ఉంది కదా..! ఒలింపిక్ చరిత్రలో ఇప్పటికీ అదో విశేషం. మరి అలా ఎందుకు జరిగిందో తెలుసుకుందాం పదండి..
జర్మనీలోని బెర్లిన్ వేదికగా 1936 సమ్మర్ ఒలింపిక్ ఘనంగా జరిగాయి. ఆగస్టు 1 తేదీ నుంచి 16 వరకు జరిగిన ఈ క్రీడాపోటీల్లో 49 దేశాల నుంచి 3,963 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. పోల్ వాల్ట్(పోల్ జంపింగ్) క్రీడా విభాగంలో జపాన్ తరఫున సుహీ నిషిదా.. సుయో ఓ పాల్గొన్నారు. అయితే, అమెరికాకు చెందిన క్రీడాకారుడు స్వర్ణ పతకం సాధించగా.. సుహీ, సుయో ఇద్దరు రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఇరువురి మధ్య టై బ్రేకింగ్ పోటీ నిర్వహించాలని ఒలింపిక్ నిర్వాహకులు నిర్ణయించారు. కానీ, నిషిదా, సుయో ఇందుకు నిరాకరించారు. వారిద్దరు మంచి స్నేహితులు కావడంతో ఒకరినొకరు ఓడించుకోవడం ఇష్టం లేక రెండో స్థానాన్ని నిర్ణయించే పోటీలో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఒలింపిక్ యాజమాన్యం పోల్ జంపింగ్లో చేసిన ప్రయత్నాల ఆధారంగా నిషిదాకు రెండో స్థానమిచ్చి రజత పతకం, సుయోకి మూడోస్థానం ఇచ్చి కాంస్య పతకం అందజేశారు.
స్నేహానికి గుర్తుగా.. రెండు ముక్కలు చేసి
జపాన్ ఒలింపిక్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం నిషిదా.. సుయోకి అంతగా రుచించలేదు. దీంతో జపాన్కు తిరిగి రాగానే వీరిద్దరి రజత, కాంస్య పతకాలను స్వర్ణకారుడి దగ్గరకు తీసుకెళ్లారు. రెండు పతకాలను సమంగా కోసి.. సగం రజతం, సగం కాంస్యంతో రెండు పతకాలు తయారు చేయించారు. వాటిని చెరొకటి తీసుకున్నారు. వాటినే ప్రస్తుతం ‘ది మెడల్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్’ అని పిలుస్తుంటారు. సుయో పతకాన్ని జపాన్లోని ఓ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ