IND vs NZ: బాబ్బాబూ.. నేను తిన్నది స్వీట్‌ సుపారీ నాయనా.. 

సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఒకే ఒక్క స్టిల్‌తో రాత్రికిరాత్రే సెలబ్రెటీలు అవుతున్న వారూ ఉన్నారు. మీమర్స్‌ అయితే...

Published : 28 Nov 2021 01:26 IST

రాత్రికిరాత్రే సోషల్‌ మీడియాలో సెలబ్రిటీగా మారిన యువకుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ఒకే ఒక్క స్టిల్‌తో రాత్రికిరాత్రే సెలబ్రెటీలు అవుతున్న వారూ ఉన్నారు. మీమర్స్‌ అయితే వెంటనే తమ టాలెంట్‌కు పదునుపెట్టేస్తారు. కొత్త ఐడియాలతో ఆ ఫొటోకు వ్యాఖ్యలు జోడించి మరీ ఊదరగొట్టేస్తారు. అయితే ఒక్కోసారి ఆ ఇమేజ్‌తో లేనిపోని కష్టాలను కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితులూ వస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి అనుభవమే కాన్పూర్‌ వాసికి ఎదురైంది. భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన ఓ వ్యక్తి నోటితో ఏదో నములుతూ స్టైల్‌గా ఫోన్లో మాట్లాడటం టీవీ స్క్రీన్ల మీద దర్శనమిచ్చింది. ఇక అంతే పాపం క్రికెట్‌ చూడటానికి వచ్చిన ఆ యువకుడిని నెటిజన్లు ఫుట్‌బాల్‌ ఆడుకున్నట్లు ఆడేసుకున్నారు. అతడు గుట్కా నములుతూ అలా ఫోన్లో మాట్లాడుతున్నాడని విమర్శలు గుప్పించారు. మరోవైపు మీమర్స్‌ అయితే చెలరేగిపోయారు. దీంతో ఒక్కసారిగా కుర్రాడు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయాడు. 

ఎట్టకేలకు ఈ ఘటనపై యువకుడు స్పందించాడు. ‘‘అయ్యబాబోయ్‌ నేను గుట్కా  నమలలేదు బాబూ.. ఏదో స్వీట్‌ సుపారీ పలుకులు మాత్రమే తిన్నా’’ అంటూ వివరణ ఇచ్చుకున్నాడు. ఇంతకీ ఇతగాడి పేరు షోబిత్‌ పాండే అంట. ఆ రోజు తన సోదరి ఇచ్చిన స్వీట్‌ సుపారీని మాత్రమే తిన్నానని చెప్పుకొచ్చాడు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి..

Read latest Sports News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని