ఆయనకు భయపడి మూలకు నక్కి తినేవాడిని
ఓ సీనియర్ ఆటగాడికి భయపడి ఆయన కంటపడకుండా ఓ మూలకు నక్కేవాడినని టీమ్ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్ అన్నారు. సారథిగా ఎంపికైన తర్వాతా ఆయన తనను మందలించేవాడని పేర్కొన్నారు.......
కెప్టెన్ అయ్యాకా తనను మందలించేవాడన్న హరియాణా హరికేన్
ఇంటర్నెట్డెస్క్: ఓ సీనియర్ ఆటగాడికి భయపడి ఆయన కంటపడకుండా ఓ మూలకు నక్కేవాడినని టీమ్ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్ అన్నారు. సారథిగా ఎంపికైన తర్వాతా ఆయన తనను మందలించేవాడని పేర్కొన్నారు. అయితే.. ఆయనది ప్రేమించే స్వభావమేనని వెల్లడించారు. టీమ్ఇండియా మాజీ ఆటగాడు, మహిళల జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్తో ముఖాముఖిలో హరియాణా హరికేన్ చెప్పిన ఆసక్తికర సంగతులు మీకోసం..!
భారత్కు తొలిసారి వన్డే ప్రపంచకప్ అందించిన కపిల్దేవ్ దిగ్గజ స్పిన్నర్ బిషన్సింగ్ బేడీ నాయకత్వంలో అరంగేట్రం చేశారు. సునిల్ గావస్కర్ సారథ్యంలో ఎక్కువగా ఆడారు. అయితే 1978-79 సీజన్లో మాత్రం స్పిన్నర్ ఎస్.వెంకటరాఘవన్ కెప్టెన్సీలో ఆడారు. అప్పుడు కొత్త కుర్రాడు కావడంతో వెంకటరాఘవన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డానని కపిల్ గుర్తుచేసుకున్నారు. తన ముఖం చూస్తేనే ఆయన చిరాకుపడేవారని పేర్కొన్నారు. వీడ్కోలు పలికిన తర్వాత అంపైర్గా చేసిన రాఘవన్ బౌలర్లు అప్పీల్ చేస్తే నాటౌట్ అని చెప్పడమూ మందలించినట్టుగానే ఉండేదని వెల్లడించారు.
‘టెస్టు మ్యాచులో సాయంత్రపు విరామాన్ని ఇంగ్లాండ్లో తేనీటి విరామం అంటారు. దాన్నెందుకు తేనీటి విరామం అనాలని వెంకటరాఘవన్ వాదించేవారు. కొట్లాటకు దిగేవారు. అది టీ, కాఫీ విరామంగా ఉండాలనేవారు. ఆయన్ను చూస్తే నేను చాలా భయపడేవాడిని. ఎందుకంటే ముందు ఆయన కేవలం ఇంగ్లిష్లోనే మాట్లాడేవారు. రెండోది ఆయన చాలా ఆవేశపరుడు’ అని కపిల్ అన్నారు.
‘1979లో ఇంగ్లాండ్కు వెళ్లినప్పుడు వెంటకరాఘవన్ సారథి. భయంతో డ్రస్సింగ్రూమ్లో ఆయనకు కనిపించకుండా ఉండేవాడిని. జట్టులో బేడీ, ప్రసన్న, చంద్రశేఖర్ వంటి సీనియర్లు ఉండేవారు. వాళ్లను ఆయన ఏం అనేవారు కాదు. అందుకే నేను కనిపిస్తే అంతే సంగతులు. ఉరిమినట్టు చూసేవారు. సాధారణంగా నేను ఎక్కువగా తింటాను. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటానన్నట్టు ఆయన చూపులుండేవి. అందుకే కనిపించకుండా ఓ మూలకు నక్కేవాడిని’ అని కపిల్ గుర్తు చేసుకున్నారు.
‘1983లో నా సారథ్యంలో జట్టు వెస్టిండీస్కు వెళ్లింది. బార్బడోస్లో టెస్టు ఆడుతున్నాం. పిచ్ బౌన్సీగా అనిపించడంతో ఎక్కువగా పేసర్లుకు బంతినిచ్చాను. స్పిన్నర్గా ముందు రవిశాస్త్రితో వేయించాను. అప్పుడు స్లిప్లో ఉన్న రాఘవన్.. కపిల్ అని నన్ను పిలిచారు. చెప్పండి వెంకీ అని బదులిచ్చాను. అంతకుముందు సర్ అనేవాడిని. అప్పుడాయన ‘నేను బౌలింగ్ చేయనని చెప్పానా?’ అని ప్రశ్నించారు. అప్పుడు కెప్టెన్ ఎవరో నాకర్థం కాలేదు. అయితే ‘సరే వెంకీ.. మీ సమయం వస్తుంది’ అని బదులిచ్చాను. ఆయనది ప్రేమించే స్వభావమే. కెప్టెన్ అయినప్పటికీ ఆయన నన్ను మందలించేవారు’ అని కపిల్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు