IPL: విరాట్ కోహ్లీతో సమానంగా నిలిచిన కేఎల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త ఫ్రాంచైజీలు లఖ్నవూ, అహ్మదాబాద్ జట్ల ముగ్గురేసి..
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త ఫ్రాంచైజీలు లఖ్నవూ, అహ్మదాబాద్ జట్ల ముగ్గురేసి ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్ను తీసుకోగా.. లఖ్నవూ టీమ్ కేఎల్ రాహుల్, మార్కస్ స్టొయినిస్, రవి బిష్ణోయిని ఎంచుకుంది. లఖ్నవూకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్కు హార్దిక్ పాండ్య సారథులుగా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి రెండో వారంలో మెగా వేలం నిర్వహించనున్నట్లు ఐపీఎల్ తెలిపింది. మొత్తం 1,214 మంది ఆటగాళ్లు మెగా వేలంలోకి వస్తున్నారు.
ఈ క్రమంలో కేఎల్ రాహుల్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకునే వారిలో కోహ్లీ సరసన చేరాడు. 2018లో వేలానికి ముందే కోహ్లీని ఆర్సీబీ రూ.17 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేఎల్ రాహుల్కు కూడా అంతే మొత్తాన్ని ఇచ్చి లఖ్నవూ సెలెక్ట్ చేసుకుంది. స్టోయినిస్ రూ.9.2 కోట్లు, రవి బిష్ణోయ్ రూ.4 కోట్లు అందుకుంటారు. లఖ్నవూ ఫ్రాంచైజీ రూ.59.89 కోట్లతో మెగా వేలంలోకి వచ్చి ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది.
అహ్మదాబాద్ సారథిగా ఎంపికైన హార్దిక్ పాండ్యకు రూ.15 కోట్లు దక్కనుండగా.. రషీద్ ఖాన్కు కూడానూ రూ.15 కోట్లు ఇస్తుండటం విశేషం. ఇక శుభ్మన్ గిల్ రూ.8 కోట్లు అందుకోనున్నాడు. దీంతో మిగతా ఆటగాళ్ల కోసం వేలంలో అహ్మదాబాద్ రూ.52 కోట్లను వెచ్చించనుంది. కెప్టెన్గా హార్దిక్ పాండ్య జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపుతాడని ఆ జట్టు మెంటార్ గ్యారీ కిర్స్టెన్ తెలిపాడు. సారథిగా అనుభవం లేకపోయినా రాణిస్తాడనే నమ్మకం మాత్రం తమకుందని పేర్కొన్నాడు. హార్దిక్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.
ఈ సారి వీరు లేరు..
ఐపీఎల్ మెగా వేలం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే టాప్ ప్లేయర్లు అయిన కొంతమంది ఆటగాళ్లు మెగా వేలంలోకి రాకపోవడం అభిమానులను కాస్త నిరుత్సాహానికి గురి చేసేదే. అందులో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, సామ్ కరన్ వంటి ఆటగాళ్లు ఈసారి రిజిస్టర్ చేసుకోలేదు. ఇంగ్లాండ్ తరఫున స్వదేశంలో జరిగే సిరీస్ల కోసం ఐపీఎల్ మెగా వేలంలోకి బెన్ స్టోక్స్ రావడం లేదని తెలుస్తోంది. ఇదే విధంగా జో రూట్ కూడా మొదట్లో ఆసక్తి కనబరిచినా ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ కోసం తన పేరు నమోదు చేసుకోలేదు.
బరిలో నిలిచిన టాప్ ప్లేయర్లు
డేవిడ్ వార్నర్, రవిచంద్రన్ అశ్విన్, డ్వేన్ బ్రావో, మిచెల్ మార్ష్, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సురేశ్ రైనా, ప్యాట్ కమిన్స్, షకిబ్ అల్ హసన్, ట్రెంట్ బౌల్ట్, స్టీవ్ స్మిత్, డికాక్, రబాడ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు సహా 49 మంది బేసిక్ ధర రూ.2 కోట్ల జాబితాలో ఉన్నారు. భారత ఆల్రౌండర్ షారుక్ ఖాన్ రూ.20 లక్షలతో బేసిక్ ధరతో ఉన్నా వేలంలో భారీ మొత్తం దక్కుతుందని ఆశిస్తున్నాడు. టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ బేసిక్ ధర రూ.50 లక్షల కేటగిరీలో తన పేరును నమోదు చేసుకున్నాడు. నిషేధం పూర్తి చేసుకుని మైదానంలోకి దిగేందుకు ఎదురు చూస్తున్నానని ఇప్పటికే పలుమార్లు శ్రీశాంత్ చెప్పాడు.
* బేసిక్ రూ. 1.5 కోట్లు: అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, ఆరోన్ ఫించ్, ఇయాన్ మోర్గాన్, డేవిడ్ మలన్, టిమ్ సౌథీ, జేమ్స్ నీషమ్
* బేసిక్ ధర రూ. కోటి: అజింక్య రహానె, కుల్దీప్ యాదవ్, నటరాజన్, హసరంగ, మార్క్రమ్, షంసి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.