రికార్డుల మోతకు మొతెరా సిద్ధం!
మొతెరా వేదికగా రేపటి నుంచి భారత్×ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. లక్ష్యా పది వేల మందికి సామర్థ్యమున్న ఆ స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుతురులో ఇరు జట్లు...
అరుదైన ఘనతలకు చేరువలో ఆటగాళ్లు
ఇంటర్నెట్డెస్క్: మొతెరా వేదికగా రేపటి నుంచి భారత్×ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. లక్షా పది వేల మందికి సామర్థ్యమున్న ఆ స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుతురులో ఇరు జట్లు భీకర పోరుకు సిద్ధమవుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. అయితే అరుదైన రికార్డులకు కొందరు ఆటగాళ్లు అతి చేరువలో ఉన్నారు. ఆ ఘనతలను మొతెరా వేదికగా నమోదు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇంతకీ ఆ రికార్డులేంటంటే..
విరాట్కు మరో విజయం
స్వదేశంలో సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత సారథిగా నిలవడానికి కోహ్లీ మరో విజయం దూరంలో మాత్రమే నిలిచాడు. ప్రస్తుతం ఆ జాబితాలో కోహ్లీ, ధోనీ 21 విజయాలతో సమానంగా ఉన్నారు. అయితే విరాట్ 28 టెస్టుల్లో గెలవగా మహీ 30 టెస్టుల్లో సాధించాడు. కాగా, టెస్టుల్లో ఎక్కువ విజయాలు నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ (34) అయిదో స్థానంలో ఉన్నాడు. గ్రేమ్ స్మిత్ (53), పాంటింగ్ (48), స్టీవ్ వా(41), క్లైవ్ లాయిడ్ (36) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
37 పరుగులు..
బ్యాట్స్మెన్గానూ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. 37 పరుగులు సాధిస్తే టెస్టుల్లో 7500 పరుగులు సాధించిన ఆరో భారత ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం కోహ్లీ 89 టెస్టుల్లో 52 సగటుతో 7463 పరుగులు చేశాడు.
అశ్విన్కు ఆరు వికెట్లు..
భారత్ తరఫున 400 వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా నిలవడానికి రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు దూరంలో ఉన్నాడు. ఆ ఘనత సాధిస్తే ప్రపంచ క్రికెట్లో 400 వికెట్లు మార్క్ను అందుకున్న 16వ బౌలర్గా యాష్ నిలుస్తాడు.
హిట్మ్యాన్@2500
టెస్టుల్లో 2500 పరుగుల మైలురాయిని అందుకోవడానికి రోహిత్ శర్మకు మరో 25 పరుగులు అవసరం.
ఇషాంత్ @100
కపిల్దేవ్ తర్వాత 100 టెస్టులు ఆడిన రెండో భారత పేసర్గా నిలవడానికి ఇషాంత్ శర్మ మరో మ్యాచ్ దూరంలో ఉన్నాడు. అంతేగాక వికెట్ల పరంగానూ లంబూ మరో ఘనతపై కన్నేశాడు. తొమ్మిది వికెట్లు సాధిస్తే జహీర్ఖాన్ (311)ను అధిగమిస్తాడు. అంతేగాక బ్రెట్ లీ (310), మోర్నీ మోర్కెల్ (309) వికెట్లను కూడా అధిగమిస్తాడు. ప్రస్తుతం లంబూ 302 వికెట్లు తీశాడు.
రికార్డులకు చేరువలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు
* అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్గా నిలవడానికి జేమ్స్ అండర్సన్ (611) తొమ్మిది వికెట్ల దూరంలో ఉన్నాడు. మురళీథరన్ (800), షేన్వార్న్ (708), అనిల్ కుంబ్లే (619) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
* జో రూట్ (20) మరో శతకం సాధిస్తే సెంచరీ జాబితాలో స్ట్రాస్ (21)తో సమానంగా నిలుస్తాడు.
* ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ హెర్బర్ట్ (4555) పరుగులు అధిగమించడానికి బెన్స్టోక్స్ (4543)కు 13 పరుగులు అవసరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ