IND vs SA : మా బ్యాటింగ్లో లోపాలను అధిగమించాల్సి ఉంది : విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. బ్యాటింగ్ ఆర్డర్లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ‘ఈ టెస్టు...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. బ్యాటింగ్ ఆర్డర్లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ‘ఈ టెస్టు సిరీస్ ఆసాంతం గొప్పగా సాగింది. తొలి టెస్టులో మేం మెరుగ్గా రాణించి పై చేయి సాధించాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న దక్షిణాఫ్రికా రెండో టెస్టులో గొప్పగా పోరాడి విజయం సాధించింది. అదే ఊపుతో మూడో టెస్టులో గెలుపొంది.. సిరీస్ను సొంతం చేసుకుంది. కీలక సమయాల్లో మా ఆటగాళ్లు విఫలమయ్యారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న సఫారీ జట్టు ఆధిపత్యం చెలాయించింది. మా జట్టు కంటే మెరుగ్గా రాణించింది. వెంటవెంటనే కీలక వికెట్లు కోల్పోవడంతో మేం కొంచెం వెనుకబడిపోయాం. అలాగే, కీలక సమయాల్లో బౌలర్లు కూడా విఫలమవడంతో పుంజుకోలేకపోయాం. అది చాలా నిరాశకు గురి చేసింది. సఫారీ బౌలర్లు స్థిరత్వంతో బౌలింగ్ చేసి భారత్ని దెబ్బతీశారు. పక్కా ప్రణాళికతో వచ్చి బ్యాటర్లను ఒత్తిడికి గురి చేశారు. మా బ్యాటింగ్ ఆర్డర్లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. గత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో మెరుగ్గా రాణించినంత మాత్రాన.. దక్షిణాఫ్రికాలో అదే విధంగా రాణిస్తామని గ్యారంటీ ఇవ్వలేం!’ అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
* యువ ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసం పెరిగింది : డీన్ ఎల్గర్
దక్షిణాఫ్రికా సిరీస్ సాధించడంలో కీలకంగా వ్యవహరించిన కెప్టెన్ డీన్ ఎల్గర్ కూడా మ్యాచ్పై స్పందించాడు. ‘మా జట్టులో అనుభవమున్న ఆటగాళ్లు లేకపోయినా.. భారత్ లాంటి బలమైన జట్టుపై సిరీస్ సాధించినందుకు గర్వంగా ఉంది. ఈ సిరీస్లో చాలా సార్లు ఒత్తిడికి గురైనా.. మా కుర్రాళ్లు గొప్పగా పుంజుకున్నారు. ఈ విజయంతో కుర్రాళ్లలో ఏ జట్టుపై అయినా గెలవగలమనే నమ్మకం పెరిగింది. సమష్టిగా రాణించడంతోనే ఈ విజయం సాధ్యమైంది. కీగన్ పీటర్సన్ గొప్పగా రాణించాడు. సిరీస్ సాధించినంత మాత్రాన మా జట్టులో లోపాలు ఏం లేవని చెప్పలేం. మా జట్టు ఆటగాళ్లలో కూడా కొన్ని లోపాలున్నాయి. రాబోయే సిరీస్ల్లో వాటిని అధిగమిస్తాం’ అని డీన్ ఎల్గర్ వివరించాడు. మూడు మ్యాచుల టెస్టు సిరీస్ను దక్షిణాఫ్రికా జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!