INDvsSL: ఒకటి, రెండు ఆటలతో కెరీర్ ఆగదు
ఒకటి, రెండు ఆటలతో కెరీర్ ముగిసిపోదని టీమ్ఇండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. అయితే, చాలా కాలం అవకాశాలు రాకపోతే మన మీద మనకే సందేహాలు నెలకొంటాయని కూడా చెప్పాడు...
కొలంబో: ఒకటి, రెండు ఆటలతో కెరీర్ ముగిసిపోదని టీమ్ఇండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. అయితే, చాలా కాలం అవకాశాలు రాకపోతే మన మీద మనకే సందేహాలు నెలకొంటాయని కూడా చెప్పాడు. ఈ ఏడాది మార్చిలో పుణెలో ఇంగ్లాండ్తో ఆడిన ఓ మ్యాచ్లో ఈ మణికట్టు స్పిన్నర్ 84 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికి అవకాశాలు రావనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆదివారం శ్రీలంకతో ఆడిన మ్యాచ్లో కుల్దీప్ 2/48 ప్రదర్శన చేసి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన అతడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఇంగ్లాండ్తో ఆ మ్యాచ్ తర్వాత నేనెప్పుడూ పరిమిత ఓవర్ల క్రికెట్లో నా కెరీర్ ముగిసిపోయిందని అనుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా పరుగులిస్తారు. అలాగే ఇదివరకు నేను నాలుగు, ఐదు వికెట్ల ప్రదర్శనలు కూడా చేశాను. ప్రజలు వాటిపైనా మాట్లాడితే ఇంకా బాగుండేది. ఒకటి, రెండు మ్యాచ్లు మన కెరీర్ను ముగించలేవు. ఈ ఆట ఆడి దీనిపై మంచి అవగాహన ఉన్నవాళ్లకు ఎవరికైనా ఈ నిజం తెలిసే ఉంటుందని నేను నమ్ముతున్నా. ఇంగ్లాండ్ సిరీస్లో పుణె పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో స్పిన్నర్లకు సహకరించలేదు. వికెట్లు సహకరించనప్పుడు ఎవరికైనా అలాగే జరుగుతుంది’ అని కుల్దీప్ పేర్కొన్నాడు.
‘మరోవైపు బయోబుడగలో ఉండటం చాలా కష్టం. మరీ ముఖ్యంగా అవకాశాలు రానప్పుడు మనమీద మనకే నమ్మకం ఉండదు. అదింకా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు చాలా మంది మనకు సహాయం చేయాలని చూస్తారు. మనతో మాట్లాడాలనుకుంటారు. అలా ఎక్కువ మందితో మాట్లాడితే అనవసరంగా కొత్త సందేహాలు కలుగుతాయి. ఈ మ్యాచ్కు ముందు నేనెంతో ఒత్తిడికి గురయ్యాను. మంచి ప్రదర్శన చేయాలని అనుకున్నప్పుడు ఇది సహజంగానే జరుగుతుంది. అయితే, అందరికన్నా ముందు రాహుల్ ద్రవిడ్ సర్ నాకు అండగా నిలిచారు. తన మాటలతో స్ఫూర్తి నింపారు. అన్నిటికన్నా ముఖ్యంగా నా ఆటను ఆస్వాదించమని చెప్పారు. అదిప్పుడు సత్ఫలితం ఇచ్చింది. దాంతో చాలా సంతోషంగా ఉన్నాను’ అని కుల్దీప్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం