T20 League : ఇది పొట్టి క్రికెట్ బాసూ .. ఇక్కడ స్ట్రైక్రేట్ మరీ ఇంత ఉంటే కష్టమే!
పరుగుల వరదకు మారుపేరు టీ20 లీగ్.. ఇలాంటి టోర్నీల్లో స్ట్రైక్ రేట్ చాలా కీలకం. అయితే కొందరు ...
ఇంటర్నెట్ డెస్క్: పరుగుల వరదకు మారుపేరు టీ20 లీగ్.. ఇలాంటి టోర్నీల్లో స్ట్రైక్రేట్ చాలా కీలకం. అయితే కొందరు స్టార్ క్రికెటర్లు మాత్రం హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేసినా ఒక్కో మ్యాచ్లో సరైన స్ట్రైక్రేట్ను రొటేట్ చేయలేకపోయారు. లోస్కోరింగ్ మ్యాచ్ల్లో నెమ్మదిగా ఆడితే ఫర్వాలేదు కానీ.. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు కూడానూ బంతులను ఎక్కువ తీసుకోవడం మాత్రం పొట్టి ఫార్మాట్కు నప్పదు. మరి ఈ సీజన్లో నిదానంగా పరుగులు రాబట్టిన ఆ స్టార్ క్రికెటర్లు ఎవరనేది ఓసారి తెలుసుకుందాం..
- విరాట్ కోహ్లీ: ఫామ్లో లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈసారి సీజన్లో ఎట్టకేలకు ఒక అర్ధశతకం నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ చేయడానికి 45 బంతులు తీసుకున్నాడు. ఆ తర్వాత వేగంగా పరుగులు చేశాడా...? అంటే అదీ లేదు. 53 బంతుల్లో 58 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ స్ట్రైక్రేట్ 109.43. ఇదే మ్యాచ్లో రాజత్ పాటిదార్ (52:32 బంతుల్లో) స్ట్రైక్రేట్ (162.5) కోహ్లీ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఆఖరికి గుజరాత్నే విజయం వరించింది.
- జోస్ బట్లర్: మూడు సెంచరీల హీరో, రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ కూడా ఓ మ్యాచ్లో నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ముంబయితో జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లో 128.85 స్ట్రైక్రేట్తో 67 పరుగులు సాధించాడు. అయితే హాఫ్ సెంచరీ చేయడానికి 48 బంతులు తీసుకోవడం విశేషం. ఓపెనర్గా వచ్చిన బట్లర్ గత మ్యాచ్లతో పోలిస్తే చాలా నెమ్మదిగా పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్లో విజయం సాధించిన ముంబయి 15వ సీజన్లో బోణీ కొట్టింది. ప్రస్తుత సీజన్లో బట్లర్ మూడు శతకాలు, మూడు అర్ధ శతకాలు నమోదు చేశాడు.
- కేన్ విలియమ్సన్: హైదరాబాద్ను నడిపిస్తున్న కేన్ విలియమ్సన్ బ్యాటింగ్లో ఫర్వాలేదనిపిస్తున్నా వేగంగా మాత్రం ఆడలేకపోతున్నాడు. తొలి రౌండ్లో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 46 బంతుల్లో 57 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 123.91 ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో నెమ్మదిగానే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కానీ కేన్ లాంటి సూపర్ బ్యాటర్ స్థాయికి తగ్గ ప్రదర్శన కాదనే చెప్పాలి. అయితే గుజరాత్పై హైదరాబాద్ విజయం సాధించడంలో మాత్రం కీలకంగా ఆ ఇన్నింగ్స్ మారింది. ఇప్పటి వరకు కేవలం ఒక హాఫ్ సెంచరీనే నమోదు చేశాడు.
- కేఎల్ రాహుల్: ప్రస్తుత సీజన్లో జోస్ బట్లర్ తర్వాత అత్యంత డేంజరస్ ఫామ్లో ఉన్న బ్యాటర్ లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్. రెండు శతకాలు, రెండు అర్ధశతకాలతో చెలరేగుతున్నాడు. అయితే హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేశాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ముగిసేసరికి 50 బంతులకు 136 స్ట్రైక్రేట్తో 68 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ కంటేపైగా పరుగులు చేసినప్పుడు రాహుల్ స్ట్రైక్రేట్ తక్కువగా ఉన్నది ఈ మ్యాచ్లోనే కావడం విశేషం.
- హార్దిక్ పాండ్య: గత రెండు సీజన్లలో ఫామ్లో లేని హార్దిక్ పాండ్య ఈసారి మాత్రం అదరగొట్టేస్తున్నాడు. బౌలింగ్లో పెద్దగా రాణించలేకపోతున్నప్పటికీ.. బ్యాటింగ్లో మాత్రం మంచి ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. అయితే తొలిసారి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 119. 05 స్ట్రైక్రేట్తో 42 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేసిన నాటౌట్గా నిలిచాడు. ఇక కోల్కతాతో జరిగిన మ్యాచ్లోనూ (67) అర్ధశతకం సాధించాడు. అయితే స్ట్రైక్రేట్ 136.73 మాత్రమే. ఆ మ్యాచ్లో హైదరాబాద్ విజయం సాధించింది.
- ఇషాన్ కిషన్: ముంబయి జట్టు భారీగా (రూ.15.25 కోట్లు) ఖర్చు పెట్టి మరీ దక్కించుకున్న యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తొమ్మిది మ్యాచ్లకుగాను కేవలం రెండు హాఫ్ సెంచరీలను మాత్రమే నమోదు చేశాడు. ఓపెనర్గా వచ్చినప్పుడు వేగంగా పరుగులు రాబడితే మిగతా బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుంది. అయితే రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం 125.58 స్ట్రైక్రేట్తో 43 బంతుల్లో 54 పరుగులు చేశాడు. రాజస్థాన్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడలేకపోయాడు. ఆఖరికి ముంబయి 170/8 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. తిలక్ వర్మ (33 బంతుల్లో 61 పరుగులు) ధాటిగా ఆడినా ప్రయోజనం దక్కలేదు.
- శిఖర్ ధావన్: పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ బ్యాటర్ సందర్భానుచితంగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. ఇప్పటివరకు మూడు అర్ధ శతకాలు చేసిన శిఖర్ ధావన్ గత మ్యాచ్లో మాత్రం కాస్త నింపాదిగా ఆడాడు. గుజరాత్ నిర్దేశించిన 144 పరుగుల మోస్తరు లక్ష్య ఛేదనలో శిఖర్ ధావన్ (62నాటౌట్) 116.98 స్ట్రైక్రేట్తో ఆడాడు. అయితే ఓపెనర్ జానీ బెయిర్స్టో (1) త్వరగా ఔట్ కావడం.. మరోవైపు భానుక రాజపక్స దూకుడుగా ఆడటంతో శిఖర్ ఆచితూచి ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదే మ్యాచ్లో గుజరాత్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ 130 స్ట్రైక్రేట్తో 50 బంతుల్లో 60 పరుగులు చేశాడు.
- సంజూ శాంసన్: రోటీన్కు భిన్నంగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ కేవలం 110.20 స్ట్రైక్రేట్తో 49 బంతుల్లో 54 పరుగులే చేశాడు. అయితే ఆఖర్లో హెట్మయేర్ (13 బంతుల్లో 27నాటౌట్) విజృంభించడంతో కోల్కతాకు ఓ మోస్తరు లక్ష్యం (153) నిర్దేశించగలిగింది. సంజూ శాంసన్ తొలి నుంచీ ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టేవాడు. అయితే బట్లర్ (22), పడిక్కల్ (2), కరుణ్ నాయర్ (13), రియాన్ పరాగ్ (19) ఔట్ కావడంతో సంజూ ఇన్నింగ్స్ నెమ్మదించింది. ఆఖరుకు కోల్కతా 19.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయిం లక్ష్యాన్ని ఛేదించింది.
- డుప్లెసిస్: టోర్నీ ఆరంభ మ్యాచుల్లో అదరగొట్టేసిన డుప్లెసిస్ తర్వాత నెమ్మదించాడు. పది మ్యాచులకుగాను 278 పరుగులు చేసిన డుప్లెసిస్ కేవలం రెండు అర్ధ శతకాలను నమోదు చేశాడు. పంజాబ్పై 154.39 స్ట్రైక్రేట్తో (57 బంతుల్లో 88), లఖ్నవూపై 150 స్ట్రైక్రేట్ (64 బంతుల్లో 96) భారీ ఇన్నింగ్స్లను ఆడాడు. పంజాబ్పై ఓడగా.. లఖ్నవూపై విజయం సాధించింది. ఇక ఆ తర్వాత అతడి స్థాయి ఆటను ఆడలేకపోయాడు. దీంతో బెంగళూరు విజయాలు సాధించడంలో వెనుకబడింది.
- ఎంఎస్ ధోనీ: కెప్టెన్సీ బాధ్యతలను వదిలి సీజన్ను ప్రారంభించిన ఎంఎస్ ధోనీ తొలి మ్యాచ్లోనే అర్ధ శతకం చేసి ఆకట్టుకున్నాడు. అదీనూ ఏడోస్థానంలో వచ్చిన ధోనీ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. అయితే ఆరంభంలో ఆచితూచి ఆడిన ధోనీ చివరికి 131.58 స్ట్రైక్రేట్తో 38 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇప్పటి వరకు చెన్నై ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ధోనీకిదే అర్ధ శతకం. మరోవైపు హైదరాబాద్తో జరిగిన మ్యాచ్కు ముందు రవీంద్ర జడేజా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో మళ్లీ ధోనీనే పగ్గాలు చేపట్టాడు. హైదరాబాద్పై విజయంతో తన కెప్టెన్సీ పవర్ను చూపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి