థాంక్యూ.. టీమ్‌ఇండియా అంటున్న లైయన్‌

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ టీమ్‌ఇండియాకు ధన్యవాదాలు తెలియజేశాడు. తన వందో టెస్టు సందర్భంగా సంతకాలు చేసిన టీమ్‌ఇండియా జెర్సీ అందజేసింనందుకు కృతజ్ఞతలు తెలిపాడు. కెరీర్‌లో మరిన్ని పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాల్సిన సమయం...

Published : 28 Jan 2021 00:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ టీమ్‌ఇండియాకు ధన్యవాదాలు తెలియజేశాడు. తన వందో టెస్టు సందర్భంగా సంతకాలు చేసిన టీమ్‌ఇండియా జెర్సీ అందజేసింనందుకు కృతజ్ఞతలు తెలిపాడు. కెరీర్‌లో మరిన్ని పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాల్సిన సమయం వచ్చేసిందని తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

బోర్డర్‌-గావస్కర్‌ సిరీసులో భాగంగా ఆఖరి టెస్టు గబ్బా వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌కు అది వందో టెస్టు. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత అతడు ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ వారం రోజులున్నాక తన కెరీర్‌ను సమీక్షించుకున్నాడు. ఆటగాళ్లతో ఎన్నో బంధాలు ఏర్పడ్డాయని, ఆత్మీయత పెరిగిందని పేర్కొన్నాడు.

‘ఇంటికొచ్చి వారం రోజులు అయ్యాక వేసవి క్రికెట్‌ను సమీక్షించుకొనే అవకాశం లభించింది. ఆస్ట్రేలియాకు ఆడటం, బ్యాగీ గ్రీన్‌ అందుకోవడం ఎప్పటికీ నాకు కలే. ఆసీస్‌కు ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడినందుకే నేనెంతో కృతజ్ఞత, వినయంగా భావిస్తాను. అలాంటింది మరో 99 ఎక్కువే ఆడాను. ఆస్ట్రేలియా క్రికెట్‌లోని గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం నాకు దక్కింది. వారితో జీవితకాల స్నేహం దొరికింది. వందో టెస్టు ఆడేందుకు బ్రిస్బేన్‌ మైదానంలోకి రావడం వ్యక్తిగతంగా నేనెంతో గర్వించే సందర్భం. అక్కడ మేమనుకున్నది చేయలేకపోయినా ప్రతి రోజూ మెరుగైన క్రికెటర్‌ అయ్యేందుకు నేర్చుకుంటూనే ఉంటా’ అని లైయన్‌ అన్నాడు.

‘సిరీస్‌ గెలిచినందుకు అజింక్య రహానె, టీమ్‌ఇండియాకు అభినందనలు! టీమ్‌ఇండియా జెర్సీపై సంతకాలు చేసి బహూకరించింనందుకు, గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినందుకు ధన్యవాదాలు. ఇక మరిన్ని లక్ష్యాలను ఛేదించేందకు సమయం ఆసన్నమైంది’ అని లైయన్‌ తెలిపాడు.

ఇవీ చదవండి
రూట్‌.. రైట్‌ రైట్‌! కోహ్లీ ఆపగలడా?
భయం లేదు.. దాదా క్షేమం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని