IPL 2021 TITLE: నా అంచనా ప్రకారం ఆ జట్టుదే ఐపీఎల్ టైటిల్: మైఖేల్ వాన్
ఐపీఎల్ 2021 సీజన్ విజేత ఎవరో చెప్పిన మైకెల్ వాన్
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తుదిపోరు జరుగుతోంది. టాస్ నెగ్గిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఆయా ఫ్రాంచైజీ అభిమానులు తమ జట్టే గెలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. క్రికెట్ వ్యాఖ్యాతలు, విశ్లేషకులు తమదైన అంచనాలతో ఏ జట్టు విజయం సాధిస్తుందో చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ఏ జట్టు ట్రోఫీని గెలుచుకోనుందో ట్విటర్ ద్వారా వెల్లడించాడు. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నట్లు తెలిపాడు. కేకేఆర్పై సీఎస్కే గెలిచి నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ను తన ఖాతాలో వేసుకోనుందని వాన్ జోస్యం చెప్పాడు. అలానే సీఎస్కే ఆటగాడు, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికవుతాడని వెల్లడించాడు.
ఇదీ జట్లపరంగా బలాలు..
జట్లపరంగా సీఎస్కే, కేకేఆర్ సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లతోపాటు ఆల్రౌండర్లూ సమతూకంగా ఉన్నారు. సీఎస్కేలో ధోనీ అదనపు బలం కాగా.. డుప్లెసిస్, రుతురాజ్, అంబటి రాయుడు, ఉతప్ప వంటి టాప్ బ్యాటర్లు ఉన్నారు. మొయిన్ అలీ, జడేజా సూపర్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. బౌలింగ్ దళం దీపక్ చాహర్, ఠాకూర్, బ్రావో, హేజిల్వుడ్ రాణిస్తున్నారు. చివరి బ్యాటర్ వరకు బ్యాటింగ్ చేయగలిగి ఉండటం చెన్నై సూపర్ కింగ్స్ బలంగా చెప్పుకోవచ్చు. మరోవైపు లీగ్ దశలో అద్భుతంగా పుంజుకుని వరుస విజయాలతో కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్కు చేరుకుంది. బెంగళూరు, దిల్లీపై సూపర్ విజయాలను నమోదు చేసింది. ఓపెనర్లు శుభ్మన్, వెంకటేశ్ అయ్యర్ ఫామ్లో ఉన్నారు. మిడిలార్డర్లో నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తిక్, ఇయాన్ మోర్గాన్... ఆల్రౌండర్లు షకిబ్, సునీల్ నరైన్ ఎలానూ ఉన్నారు. వీరందరినీ అడ్డుకోవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కాస్త శ్రమించాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు