HCA: ఉద్దేశపూర్వకంగానే నోటీసులు: అజహర్
ఉద్దేశపూర్వకంగానే తనకు నోటీసులు ఇచ్చారని హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు.
హైదరాబాద్: ఉద్దేశపూర్వకంగానే తనకు నోటీసులు ఇచ్చారని హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. హెచ్సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడూ పనిచేయలేదని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్లో తొమ్మిది మంది సభ్యులు ఉంటే వారిలో ఐదుగురు ఓ వర్గంగా ఏర్పడి తాము చేసిందే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా భావిస్తే ఎలా అని ప్రశ్నించారు. హెచ్సీఏలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి సమర్థుడైన వ్యక్తిని అంబుడ్స్మెన్గా నియమిస్తే ఆ ఐదుగురే తప్పుపట్టారన్నారు. వాళ్ల అవినీతి బయటపడుతుందనే అలా చేశారని అజహర్ ఆరోపించారు.
‘హెచ్సీఏ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. అడ్డుకోవాలని చూస్తున్న నాపై బురద చల్లుతున్నారు. అపెక్స్ కౌన్సిల్ సభ్యులు జాన్ మనోజ్, విజయానంద్, నరేశ్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధపై అవినీతి ఆరోపణలున్నాయి. వాళ్ల అవినీతికి నేను అడ్డుపడుతున్నందునే నాకు నోటీసులు ఇచ్చి అపెక్స్ కౌన్సిల్ జారీ చేసినట్లుగా చెబుతున్నారు’ అని అజహరుద్దీన్ అన్నారు.
‘నిజానికి అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఎవరినీ నిషేధించే హక్కు లేదు. అలాగే నోటీసులు ఇచ్చే అధికారం లేదు. మెజారిటీ లేకుండా సమావేశాలు ఎలా నిర్వహిస్తారు? ఆ ఐదుగురు చెప్పిందే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా భావిస్తే ఎలా?’ అని అజహర్ ప్రశ్నించారు.
‘పాతికేళ్లుగా వారే అనేక పదవుల్లో ఉన్నారు. సంఘంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. బ్లాక్మెయిల్ చేయడం వారికే తెలుసు. హైకోర్టు ఉత్తర్వులనూ వారు పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ వారి బెదిరింపులకు నేను లొంగను. ఎవరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారో అందరికీ తెలుసు. నేను దేశం కోసం అత్యుత్తమంగా ఆడాను. క్రికెట్ అంటే ఇష్టం కాబట్టే ఆటగాళ్లకు సలహాలు ఇచ్చేందుకు మైదానానికి వస్తాను. రావొద్దని ఎలా చెబుతారు’ అని అజహర్ అన్నారు.
‘హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నిస్తున్నా. 25 ఏళ్లుగా వచ్చిన నిధులతో ఏం చేశారు? ఉప్పల్, జింఖానా తప్ప మిగతా మైదానాలను ఎందుకు అభివృద్ధి చేయలేదు? కేవలం మైదానాలకే నెలకు రూ. 18-19 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. రెండు మూడు నెలలు క్రికెట్ ఆడితే కోట్లు ఖర్చవుతున్నాయి. స్టేడియాలను ఎందుకు నిర్మించడం లేదు? ఇప్పటికీ ఉప్పల్లో ఫైవ్ స్టార్ సౌకర్యాలు లేవు. ఇలాగే కొనసాగితే హైదరాబాద్ క్రికెట్ ఎలా అభివృద్ధి చెందుతుంది’ అని అజహర్ ఆవేదన వ్యక్తం చేశారు.
లోధా సిఫార్సుల మేరకే..: అపెక్స్ కౌన్సిల్
జస్టిస్ లోధా సిఫార్సుల మేరకే అజహరుద్దీన్పై నోటీసులు జారీచేశామని అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. కౌన్సిల్లోని ఆరుగురిలో ఐదుగురు సభ్యులు ఆ నిర్ణయం తీసుకున్నారని వివరించింది. వారిని ఓ బృందంగా పోల్చడం సరికాదని వెల్లడించింది. నిజానికి ఆ ఐదుగురే అపెక్స్ కౌన్సిలని, అది ఎన్నికైందని పేర్కొంది. వాస్తవంగా కౌన్సిల్లో తొమ్మిది మంది ఉంటారని కౌన్సిల్ తెలిపింది. ఒకరు అధ్యక్షుడైన అజహర్ కాగా, పురుషుల జట్టు నుంచి ఇద్దరు, మహిళల జట్టు నుంచి ఒకరు ఉంటారంది. ఆ మిగిలిన ఐదుగురే నిజమైన అపెక్స్ కౌన్సిలని, వారే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. ఈ రోజు నుంచి అజహరుద్దీన్ అధ్యక్షుడు కాడని, ఇందులో బీసీసీఐ జోక్యం ఉండదని స్పష్టం చేసింది. హెచ్సీఏ సమావేశాలకు అజహర్ అధ్యక్షుడిగా కాకుండా ఒక వ్యక్తిగా వస్తారని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల