IPL 2021: స్వల్ప లక్ష్యం.. చెమటోడ్చి నెగ్గిన ముంబయి
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అబుదాబి: వరుస ఓటముల తర్వాత ముంబయికి ఊరట. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచులో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబయి జట్టులో సౌరభ్ తివారి (45: 37 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్ పాండ్య(40 నాటౌట్: 4x4, 2x6) రాణించారు. చివరి ఓవర్లలో పాండ్య సిక్స్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ముంబయి విజయం తేలికైంది. అంతకు మందు ముంబయి బౌలర్లు 6 వికెట్లు తీసి పంజాబ్ను 135 పరుగులకే కట్టడి చేశారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన పొలార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
పాండ్య మెరుపులు..
పంజాబ్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయికి ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. జట్టు స్కోరు 16 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ(8), సూర్యకుమార్ యాదవ్(0)ను రవిబిష్ణోయ్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. దీంతో సౌరభ్ తివారి(45)తో జట్టు కట్టిన క్వింటన్ డికాక్(27) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అడపాదడపా ఫోర్లు, సిక్స్లతో స్కోర్ను పెంచారు. ఈక్రమంలో 9.5 ఓవర్ల వద్ద డికాక్ షమీ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో ముంబయి స్కోరు 10 ఓవర్లకు 62/3 గా నిలిచింది. ఇదే క్రమంలో 15.1 ఓవర్ల వద్ద అర్ధసెంచరీ దిశగా సాగుతున్న సౌరభ్ తివారి ఔటయ్యాడు. నాథన్ ఎలీస్ వేసిన బౌలింగ్ కీపర్కు చిక్కాడు. దీంతో క్రీజులోకి వచ్చిన పోలార్డ్తో జట్టు కట్టిన హార్దిక్ పాండ్య మొదట నెమ్మదిగా ఆడినప్పటికీ తర్వాత వేగం పెంచాడు. మహమ్మద్ షమి వేసిన 17 ఓవర్లో హార్దిక్ ఓ సిక్స్, ఓ ఫోర్ కొట్టాడు. 18 ఓవర్లలో పోలార్డ్(15) ఓ సిక్స్, ఫోర్ కొట్టడంతో ఇక ముంబయి లక్ష్యం చిన్నదైంది. ఇక రెండు ఓవర్లలో ముంబయికి 16 పరుగులు అవసరం కాగా ఇక 19 ఓవర్లో పాండ్య విశ్వరూపం చూపించాడు. రెండు ఫోర్లు, ఓ సిక్స్తో చెలరేగడంతో ముంబయి ఒక ఓవర్ ఉండగానే గెలుపొందింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. మార్క్రమ్ (42; 29 బంతుల్లో 6 ఫోర్లు), దీపక్ హుడా (28 ) రాణించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (21), మన్దీప్ సింగ్ (15) శుభారంభం అందించినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. పంజాబ్ 36 పరుగుల వద్ద మన్దీప్ సింగ్ ఔటయ్యాడు. తర్వాత కీరన్ పొలార్డ్ వేసిన ఓవర్లో పంజాబ్కి గట్టి షాక్ తగిలింది. ఒకే ఓవర్లో క్రిస్ గేల్ (1), కేఎల్ రాహుల్ ఔటయ్యారు. ఎనిమిదో ఓవర్లో నికోలస్ పూరన్ (2)ని బుమ్రా పెవిలియన్ పంపించాడు. దీంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కష్టాల్లో ఉన్న జట్టును మార్క్రమ్, దీపక్ హుడా ఆదుకున్నారు. బౌల్ట్ వేసిన 15వ ఓవర్లో మార్క్రమ్ వరుసగా రెండు ఫోర్లు బాదగా.. హుడా ఓ బౌండరీ బాదాడు. దీంతో ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ప్రమాదకరంగా మారుతున్న మార్క్రమ్ని రాహుల్ చాహర్ క్లీన్బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన 19వ ఓవర్లో దీపక్ హుడా పొలార్డ్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 135 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. ముంబయి బౌలర్లలో పొలార్డ్, బుమ్రా రెండు, రాహుల్ చాహర్, కృనాల్ పాండ్య తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు