Bumrah-Harshal: డెత్ ఓవర్లలో బుమ్రా-హర్షల్ కలిస్తే.. బీభత్సమే సృష్టిస్తారు!
న్యూజిలాండ్పై రెండో టీ20 మ్యాచ్లో భారత్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన హర్షల్ పటేల్ ప్రదర్శనపై...
విశ్లేషించిన డానియల్ వెటోరి, రాబిన్ ఉతప్ప
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్పై రెండో టీ20 మ్యాచ్లో భారత్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన హర్షల్ పటేల్ ప్రదర్శనపై క్రికెటర్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. కివీస్ను కట్టడి చేయడంలో హర్షల్ (2/25) కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. డెత్ ఓవర్లలో అత్యంత ప్రభావవంతంగా బౌలింగ్ చేశాడు. హర్షల్ బౌలింగ్ ప్రదర్శనపై ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఛానల్లో రాబిన్ ఉతప్ప విశ్లేషిస్తూ.. ‘‘జస్ప్రీత్ బుమ్రాతో కలిసి హర్షల్ డెత్ ఓవర్లలో (ఆఖరి ఐదు ఓవర్లు) ప్రమాదకరంగా మారతాడు. ఇది భారత టీ20 జట్టుకు ఎంతో బలం. ఒత్తిడి పరిస్థితుల్లోనూ బంతిని చక్కటి స్థానంలో సంధించే నైపుణ్యం హర్షల్ సొంతం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కివీస్తో మ్యాచ్లో తన రెండో ఓవర్ తొలి బంతికే ఫిలిప్స్ భారీ సిక్సర్ కొట్టాడు. రెండో బంతికి నోబాల్గా వేశాడు. అయితే అక్కడే హర్షల్ నైపుణ్యం బయటపడింది. అద్భుతంగా పుంజుకుని ఫ్రీహిట్ బంతిని డాట్ చేయడం.. తర్వాతి బంతికే ఫిలిప్స్ను ఔట్ చేశాడు’’ అని వివరించాడు.
రాబిన్ ఉతప్ప విశ్లేషణను కివీస్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి సమర్థించాడు. ఆఖరి ఓవర్లలో బుమ్రా బౌలింగ్కు హర్షల్ పటేల్ జతకలిస్తే భారత టీ20 జట్టు భీకరంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ‘‘ఇప్పటికే డెత్ ఓవర్లలో బుమ్రా ప్రమాదకరమైన బౌలర్ అని తెలుసు. ఆఖరి ఓవర్లలో హర్షల్ పటేల్ కూడా బౌలింగ్ చేసే నైపుణ్యం పెంచుకుంటే మాత్రం పొట్టిఫార్మాట్లో టీమ్ఇండియా జట్టు బలోపేతమవుతుంది. మరో కొత్త బౌలర్ అవేశ్ ఖాన్ పవర్ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఎందుకంటే అతడు స్పెషలిస్ట్ బౌలర్గా టాప్ స్థానంలో ఉన్నాడు’ అని వెటోరీ విశ్లేషించాడు. ఇతర జట్లలోనూ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసేందుకు ఎక్కువ మంది బౌలర్లు లేరని, అయితే భారత్కు కనీసం ఇద్దరు ఉండటం వల్ల టీ20ల్లో టీమ్ఇండియా భీకరమైన జట్టుగా మారుతుందని వెటోరి అంచనా వేశాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు