T20 World Cup 2021: స్కాట్లాండ్పై కివీస్ గెలుపు
టీ20 ప్రపంచకప్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు..
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో భాగంగా దుబాయ్ వేదికగా స్కాట్లాండ్తో మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కివీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో మైఖేల్ లియాస్క్ (42) టాప్ స్కోరర్గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఇస్ సోదీ రెండేసి, టిమ్ సౌథీ ఒక వికెట్ తీశారు.
ఛేదనకు దిగిన స్కాట్లాండ్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్ కైల్ కోట్జర్ (17) ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన మాథ్యూ క్రాస్ (27)తో కలిసి.. జార్జ్ మున్సీ (22) నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే ఇష్ సోదీ వేసిన ఎనిమిదో ఓవర్లో క్రీజులో జార్జ్ మున్సీ ఔటయ్యాడు. కొద్ది సేపటికే క్రాస్ కూడా.. బౌల్డై క్రీజు వీడాడు. దీంతో 11 ఓవర్లకు స్కాట్లాండ్ 77 పరుగులతో నిలిచింది. అయితే, ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండటంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్ లాయిడ్ (17), రిచీ బెర్రింగ్టన్ (20) వేగంగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరారు. ఆఖర్లో వచ్చిన మైఖేల్ లియాస్క్ (42*) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. స్కాట్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బ్యాటర్లలో మార్టిన్ గప్తిల్ (93: 56 బంతుల్లో 4x6, 6X7) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. గ్లెన్ ఫిలిప్స్ (33) రాణించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లే వీల్ రెండేసి, మార్క్ వాట్ ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?