ICC: ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ కెప్టెన్గా బాబర్ ఆజామ్
ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లతో కూడిన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఇందులో ఒక్క భారత..
టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లతో కూడిన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఇందులో ఒక్క భారత క్రికెటర్కు కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఛాంపియన్స్గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నుంచి ముగ్గురిని, రన్నర్స్ కివీస్ జట్టు నుంచి ఒకరిని, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల నుంచి తలో ఇద్దరినీ ఉత్తమ ఆటగాళ్లుగా ఐసీసీ ప్యానెల్ ఎంపిక చేసింది. పాకిస్థాన్ పేసర్ షహీన్ షా అఫ్రిదీని రిజర్వ్ ప్లేయర్గా ప్రకటించింది. పాకిస్థాన్ జట్టు సెమీ ఫైనల్ చేరడంలో కీలకంగా వ్యవహరించిన బాబర్ ఆజామ్ను కెప్టెన్గా, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్లను ఓపెనర్లుగా ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్లో తొలి రెండు మ్యాచుల్లో టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో.. కనీసం సెమీ ఫైనల్ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఐసీసీ ప్రకటించిన జట్టిదే..
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), జోస్ బట్లర్ (వికెట్ కీపర్-ఇంగ్లాండ్), బాబర్ ఆజామ్ (కెప్టెన్-పాకిస్థాన్), చరిత్ అసలంక (శ్రీలంక), ఐడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా), మొయిన్ అలీ ( ఇంగ్లాండ్), వణిందు హసరంగ (శ్రీలంక), ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), జోష్ హేజిల్ వుడ్ (ఆస్ట్రేలియా), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), అన్రిచ్ నార్జ్ (దక్షిణాఫ్రికా), షహీన్ షా అఫ్రిది (రిజర్వ్ ప్లేయర్-పాకిస్థాన్)
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
పదమూడు దేశాల్లో ‘నోటా’..!
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం