Ravi Shastri:ఎలాంటి పశ్చాత్తాపం లేదు.. అక్కడే కరోనా సోకి ఉండొచ్చు:రవిశాస్త్రి
ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టు సమయంలో టీమ్ఇండియా హెడ్కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టుకు ముందు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రవిశాస్త్రికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత రవిశాస్త్రితో ప్రైమరీ కాంటాక్ట్గా
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టు సమయంలో టీమ్ఇండియా హెడ్కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టుకు ముందు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రవిశాస్త్రికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత రవిశాస్త్రితో ప్రైమరీ కాంటాక్ట్గా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కూడా వైరస్ బారిన పడ్డారు. ఆపై ఇద్దరు ఫిజియోలకు కూడా కరోనా సోకింది.దీంతో భారత శిబిరంలో కరోనా రావడానికి రవిశాస్త్రియే ప్రధాన కారణమని పలు విమర్శలు వచ్చాయి.
ప్రస్తుతం రవిశాస్త్రి కొవిడ్ నుంచి కోలుకొని భారత్కు తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు.ఈ సందర్భంగా రవిశాస్త్రి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడాడు. పుస్తకావిష్కరణ కార్యక్రమంపై స్పందిస్తూ...‘ఆ కార్యక్రమంలో నేను కలిసిన వ్యక్తులు బాగానే ఉన్నారు. అందుకే నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆటగాళ్లు తమ గదుల్లో నిరంతరం ఉండటం కంటే.. బయటకు వెళ్లి వేర్వేరు వ్యక్తులను కలవడం మంచిది. ఓవల్ టెస్ట్కు 5000 మంది ప్రేక్షకులు వచ్చారు. తక్కువ మంది ఉన్న పుస్తకావిష్కరణకు వెళ్లిన నాపై వేలెత్తిచూపడానికి ఏమీ లేదు. ఈ కార్యక్రమానికి దాదాపు 250 మంది హాజరయ్యారు. వారిలో ఎవరికీ వైరస్ సోకలేదు. కాబట్టి నేను భయపడలేదు’అని అన్నాడు.
ఒక్క పారాసిటామల్ మాత్ర కూడా వేసుకోలేదు
‘10 రోజులపాటు ఐసోలేషన్లో ఉన్నాను. ఆ పది రోజుల్లో నాకు ఎటువంటి లక్షణాలు లేవు. కేవలం గొంతు నొప్పి ఒక్కటే ఉంది. శరీర ఉష్ణోగ్రత అధికంగా లేదు. ఒక్కసారి కూడా జ్వరం రాలేదు. నా ఆక్సిజన్ స్థాయులు ఎప్పుడూ 99 శాతంగా ఉన్నాయి. ఐసోలేషన్లో ఉన్న పది రోజుల పాటు నేను మందులు వాడలేదు. కనీసం ఒక్క పారాసిటమాల్ కూడా వేసుకోలేదు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
అక్కడే కరోనా సోకి ఉండొచ్చు
భారత శిబిరంలో కొవిడ్ సోకడానికి కారణం మీరేనా అని ప్రశ్నించగా.. 'ఆగస్టు 31 పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. నాకు సెప్టెంబర్ 3న పాజిటివ్గా తేలింది. మూడు రోజుల వరకు వైరస్ లక్షణాలు బయటపడవు. కాబట్టి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నాకు వైరస్ సోకలేదు. లీడ్స్లోనే వైరస్ సోకి ఉండొచ్చు. ఇంగ్లాండ్ జులై 19న కరోనా ఆంక్షలను సడలించింది. దీంతో హోటళ్లు, లిఫ్ట్లు అన్ని తెరుచుకున్నాయి.అప్పుడూ ఏమైనా జరిగి ఉండొచ్చు’అని బదులిచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.