T20 World Cup 2021: అంచనాలు లేకుండా దిగారు.. దుమ్మురేపుతున్నారు..
ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్లో దుమ్మురేపుతోంది. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో మినహా మిగతా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి సెమీస్కు దూసుకొచ్చింది. ఇందులో బలమైన ఇంగ్లాండ్ని
ఇంటర్నెట్ డెస్క్: ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్లో దుమ్మురేపుతోంది. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో మినహా మిగతా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి సెమీస్కు దూసుకొచ్చింది. ఇందులో బలమైన ఇంగ్లాండ్ని ఢీ కొట్టి చిత్తు చిత్తుగా ఓడించి పొట్టి ప్రపంచకప్లో తొలిసారి ఫైనల్కు చేరింది. అయితే, 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్, 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్.. ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. ప్రస్తుతం సాధించిన విజయంతో ఆ ఓటములకు ప్రతీకారం తీర్చుకుంది కివీస్.
అయితే, ఈ మ్యాచ్లో 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 16 ఓవర్లు ముగిసే సరికి 107/4 నిలిచింది. ఇలాంటి స్థితిలో ఓపెనర్ డారిల్ మిచెల్ (72), జిమ్మీ నీషమ్ (27) వీరోచిత ఇన్నింగ్స్లు ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లాండ్ని ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్ జట్టుపై ప్రస్తుత క్రికెటర్లతోపాటు మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెందూల్కర్, పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్, భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, ఇర్ఫాన్ పఠాన్, వసీమ్ జాఫర్, ఆకాశ్ చోప్రా, అజిత్ అగార్కర్తోపాటు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ న్యూజిలాండ్కి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.
‘క్రికెట్లో అద్భుతమైన మ్యాచ్. న్యూజిలాండ్ మ్యాచ్ గెలవడంతో పాటు మరోసారి హృదయాలను గెలుచుకుంది. కాన్వే, నీషమ్ల సహకారంతో మిచెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద బెయిర్ స్టో చేసిన ఫీల్డింగ్.. 2019 ఫైనల్స్లో బౌల్ట్ ఫీల్డింగ్ని నాకు గుర్తు చేసింది’ అని సచిన్ తెందూల్కర్ ట్వీట్ చేయగా.. ‘ప్రపంచకప్లో ఇది బెస్ట్ మ్యాచ్. డారిల్ మిచెల్ వీరోచిత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. జిమ్మీ నీషమ్ గేమ్ ఛేంజర్. న్యూజిలాండ్ అంటేనే సంచలనం. ఫైనల్స్కి చేరిన న్యూజిలాండ్కి శుభాకాంక్షలు’ అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మిగతా ఆటగాళ్లు చేసిన ట్వీట్లను కూడా చూసేయండి.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. -
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్