wimbledon: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ విజేతగా జకోవిచ్‌

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌ అదరగొట్టాడు. మాటో బెరిటిని (ఇటలీ)ని ఓడించి ఆరోసారి

Updated : 11 Jul 2021 22:35 IST

వింబుల్డన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌ అదరగొట్టాడు. మాటో బెరిటిని (ఇటలీ)ని ఓడించి ఆరోసారి వింబుల్డన్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 6-7, 6-4, 6-4, 6-3 తేడాతో జకోవిచ్‌ గెలిచాడు. మొదటి సెట్‌ను కోల్పోయిన జకో తర్వాత పుంజుకొని అద్భుతంగా రాణించాడు. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్(20) సరసన జకో చేరాడు. ఇక తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలవాలని ఉవ్విళ్లూరిన బెరిటినికి నిరాశ తప్పలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని