ఆ సమయంలో నా భవిష్యత్తు ఏంటో అర్థం కాలేదు : టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్
అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే అతి దారుణమైన 9/11 దాడులు జరిగి నేటికి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దాడులు జరిగినప్పుడు అమెరికాలోనే ఉన్న భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్..
ఇంటర్నెట్ డెస్కు : అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే అతి దారుణమైన 9/11 దాడులు జరిగి నేటికి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దాడులు జరిగినప్పుడు అమెరికాలోనే ఉన్న భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తన అనుభవాలను పంచుకొన్నారు. ‘దాడులు జరిగే కంటే కొద్ది రోజులు ముందే నేను యూఎస్ ఓపెన్లో పాల్గొనేందుకు మరో ఆటగాడు మహేశ్ భూపతితో కలిసి అమెరికా వెళ్లాను. మొదటి రౌండ్లోనే మేం ఓడిపోయాం. అయితే, అదే నెల చివర్లో డేవిస్ కప్ కూడా ఉండటంతో అమెరికాలోనే ఉండిపోయాం. అదే సమయంలో ట్విన్ టవర్స్పై విమాన దాడులు జరిగాయి. దీంతో ఆటగాళ్లు చాలా గందరగోళానికి గురయ్యారు. దాడి జరిగే కంటే ఒక రోజు ముందు నేను ట్విన్ టవర్స్లోనే ఉన్నాను. అక్కడి నుంచి డేవిస్ కప్లో పాల్గొనేందుకు కారులో విమానాశ్రయానికి వెళ్తుంటే.. ట్విన్ టవర్స్పై దాడి గురించి తెలిసింది. మొదట దాన్ని విమాన ప్రమాదమనుకున్నా. అయితే, రెండో విమానం కూడా టవర్స్పైకి దూసుకురావడంతో ఎవరో ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడేనని అర్థమైంది. ఆ సమయంలో నా కోచ్, స్నేహితులు న్యూయార్క్లోనే ఉన్నారు. దాంతో వెంటనే వారికి ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నాను. ట్విన్ టవర్స్పై దాడి కారణంగా విమానాలు రద్దు కావడంతో కారు అద్దెకు తీసుకుని ఫ్లోరిడా వెళ్లిపోయాను’ అని పేస్ పేర్కొన్నాడు.
‘ఆ సమయంలో నా భవిష్యత్తు ఏంటో అర్థం కాలేదు. విమాన ప్రయాణాలపై చాలా ఆంక్షలు ఉండేవి. సెప్టెంబరు 21-23 మధ్య జరగాల్సిన డెవిస్ కప్ టోర్నీని అక్టోబరు 12-14 మధ్య నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆటకు సంబంధించిన సామగ్రిని కూడా వెంట తీసుకెళ్లనిచ్చేవారు కాదు. ముఖ్యంగా ప్రొఫెషనల్ షూటర్లు ఆయుధాలు, టెన్నిస్ ఆటగాళ్లు రాకెట్లు తీసుకెళ్లడానికి భద్రతాపరంగా చాలా సమస్యలు ఎదురయ్యేవి. భద్రతాధికారులు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విమాన ప్రయాణాలకు అనుమతించేవారు. ఎలాగోలా కష్టపడి నార్త్ కరోలినా చేరుకున్నాం. అక్కడ అమెరికా ఆటగాళ్లు మాకు ఘనంగా స్వాగతం పలికారు. టెన్నిస్ కోర్టంతా ప్రేక్షకులతో నిండిపోయింది. మ్యాచ్ ఆరంభానికి ముందు మేమంతా ట్విన్ టవర్స్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు నివాళి అర్పించాం. అనంతరం ప్రారంభమైన టోర్నీలో అమెరికా ఆటగాళ్లు రోడిక్, బ్లేక్ జోడి టైటిల్ గెలుచుకున్నారు’ అని లియాండర్ పేస్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు