Rohit-Kohli: వారిద్దరూ నిక్కచ్చిగా.. సూటిగా మాట్లాడతారు: సల్మాన్ భట్
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు జరిగిన విలేకర్ల సమావేశంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్...
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ముందు జరిగిన విలేకర్ల సమావేశంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చాలా అద్భుతంగా మాట్లాడారని పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ ప్రశంసించాడు. భారత క్రికెటర్ల మీద పడుతున్న పనిభారాన్ని తగ్గించేందుకు ఏం చేయాలో తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. మరీ ముఖ్యంగా క్లిష్టమైన ప్రశ్నలకు సారథి రోహిత్ శర్మ స్పష్టమైన సమాధానాలను ఇచ్చాడని సల్మాన్ భట్ పేర్కొన్నాడు. టీ20ల్లో విరాట్ కోహ్లీ పాత్రపై రోహిత్ సరైన బదులిచ్చాడు. కోహ్లీ రాకతో బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుందని తెలిపాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా సూటిగా ఉంటారని భట్ కొనియాడాడు. ఎంఎస్ ధోనీ టీమ్ఇండియా జట్టు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇది మొదలైందని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్లో సల్మాన్ భట్ మాట్లాడుతూ.. ‘‘ ఇందులో ఎలాంటి సందేహం లేదు. విరాట్, రోహిత్లలో ఇష్టపడే అంశం ఏంటంటే.. మీడియా సమావేశాల్లా చాలా నిక్కచ్చిగా ఉంటారు. ధోని సారథిగా వచ్చినప్పటి మొదలు అదే కొనసాగుతుంది. భారత కెప్టెన్లు చాలా సూటిగా మాట్లాడతారు. సరైన సమాధానాలు ఇస్తారు’’ అని వివరించాడు.
క్రీడాకారులు.. సాధారణ పౌరులు ఎవరైనా సరే తగినంత విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరముంటుందని సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు. లేకపోతే తమ ప్రదర్శన, పనితనంలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ప్రతి మ్యాచ్లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం కష్టమేకానీ.. స్థిరత్వం అయితే వస్తుందన్నాడు. ‘ఆటగాళ్లు యంత్రాలు కాదు’ అన్న రోహిత్ శర్మ వ్యాఖ్యలను సల్మాన్ భట్ సమర్థించాడు. ‘‘ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వాలని నేను ఎప్పుడూ చెబుతుంటాను. లేకపోతే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో జోరును కొనసాగించడం కష్టం. క్రికెటర్లు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే వారు శక్తివంతంగా తిరిగి వచ్చి మరింత మెరుగ్గా రాణించగలరు. రోహిత్ వాదనతో నేను పూర్తిగా అంగీకరిస్తున్నా’’ అని భట్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు