Warner - Babar: మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్.. బాబర్ను కాదని వార్నర్కే ఎందుకు?
సాధారణంగా ఏదైనా క్రికెట్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన లేదా ఎక్కువ వికెట్లు పడగొట్టిన వారికి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇవ్వడం...
పాకిస్థాన్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ వివరణ
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఏదైనా క్రికెట్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన లేదా ఎక్కువ వికెట్లు పడగొట్టిన వారికి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇవ్వడం సహజం. అయితే ఈసారి టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ను కాదని.. డేవిడ్ వార్నర్కు అవార్డు వరించింది. దీనిపై క్రికెట్ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ మొదలైంది. కొందరేమో ఐసీసీ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలపగా.. మరికొందరు సరైన నిర్ణయం కాదని తప్పుబడుతున్నారు. మరి ఎందుకు అలా ఇచ్చారనేదానిపై పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ వివరించాడు. యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ను ఫైనల్లో కివీస్పై విజయం సాధించి ఆసీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ (303) కంటే ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (289) పరుగులపరంగా వెనుకనే ఉన్నాడు. అయినా బాబర్ను కాదని వార్నర్కు మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును ఐసీసీ ప్రకటించింది. దీనిపై పాక్ మాజీ స్పీడ్స్టర్ షోయబ్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వార్నర్ కంటే బాబర్ అవార్డుకు అర్హుడు అని ట్విటర్ వేదికగా అక్తర్ పేర్కొన్నాడు. అయితే షోయబ్ అభిప్రాయానికి విరుద్ధంగా పాకిస్థాన్కు చెందిన మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ స్పందించాడు. ‘‘టోర్నీలో బాబర్ ఎక్కువ పరుగులు చేశాడు. అయితే మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎంపిక కోసం అత్యధిక పరుగులనే కాకుండా ఇతర అంశాలను ఐసీసీ పరిగణనలోకి తీసుకుంది. బ్యాటర్ చేసిన పరుగులు ప్రభావం జట్టు విజయావకాశాలపై ఎలా ఉన్నాయనే దానిని పరిశీలించింది. డేవిడ్ వార్నర్ చాలా కీలకమైన మ్యాచుల్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అందువల్లే ఆసీస్ టైటిల్ను ఎగరేసుకుపోయింది’’ అని వివరించాడు.
68*, 9, 51, 70, 66, 39.. ఈ టోర్నీలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ చేసిన పరుగులు.. ఆరు మ్యాచుల్లో 126.25 స్ట్రైక్రేట్తో 303 పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లలో బాబర్ అజామ్ వ్యక్తిగతంగా మూడో టాప్ స్కోరర్. విరాట్ కోహ్లీ 319 పరుగులు (2014), దిల్షాన్ 317 పరుగులు (2009) ముందున్నారు.
14, 65, 1, 18, 89*, 49, 53.. కీలకమైన మ్యాచుల్లో తన సత్తా చాటిన ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ గణాంకాలు ఇవి. ఏడు మ్యాచుల్లో 146.70 స్ట్రైక్రేట్తో 289 పరుగులు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!