Olympics: పతకం తెస్తే ₹కోట్లు.. ఏయే దేశాలెంత ప్రకటించాయో తెలుసా?
ఒలింపిక్స్లో పాల్గొనాలనేది అథ్లెట్ల కల. ఈ మహాక్రీడల్లో గెలుపొంది పతకం సాధించే క్రీడాకారులు తమ పేరునే కాదు.. వారి దేశ ప్రతిష్ఠను సైతం ప్రపంచానికి తెలియజేసినవారవుతారు. అందుకే, అథ్లెట్లు పతకాలు గెలుపొందితే దేశాలు, స్థానిక ప్రభుత్వాలు ప్రోత్సహకంగా నగదు బహుమతులు అందజేస్తుంటాయి. ఈ సారి కూడా
ఇంటర్నెట్ డెస్క్: ఒలింపిక్స్లో పాల్గొనాలనేది అథ్లెట్ల కల. ఈ మహాక్రీడల్లో గెలుపొంది పతకం సాధించే క్రీడాకారులు తమ పేరునే కాదు.. వారి దేశ ప్రతిష్ఠను సైతం ప్రపంచానికి తెలియజేసినవారవుతారు. అందుకే, అథ్లెట్లు పతకాలు గెలుపొందితే దేశాలు, స్థానిక ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందజేస్తుంటాయి. ఈ సారి కూడా ఒలింపిక్స్లో పతకాలు తెచ్చేవారికి ప్రభుత్వాలు నజరానా ప్రకటించాయి. మన దేశంలోనే కాదు.. పలు దేశాలు కూడా పతకాలు గెలిచిన వారికి నగదు బహుమతి ఇవ్వబోతున్నాయి.
భారత్లోని వివిధ రాష్ట్రాల నుంచి 120 మంది దాకా అథ్లెట్లు ఈ సారి ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. అయితే, ఎన్ని పతకాలు వస్తాయనేది ఇప్పుడే చెప్పలేం కానీ, పతకాలు తెస్తే నగదు బహుమతులిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. స్వర్ణ పతకం గెలిస్తే రూ.75 లక్షలు, రజతం గెలిస్తే రూ.40 లక్షలు, కాంస్యం గెలిస్తే రూ.25 లక్షలు ఇస్తామని తెలిపింది. మరోవైపు తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్కు వెళ్లిన అథ్లెట్లు స్వర్ణ పతకం తెస్తే రూ.6 కోట్లు, రజతం తెస్తే రూ.4 కోట్లు, కాంస్యం తెస్తే రూ.2-2.5 కోట్లు అందజేస్తామని హరియాణా, ఉత్తర్ప్రదేశ్, ఛత్తీస్ఘడ్, ఒడిశా, ఛండీగఢ్ ప్రకటించాయి. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు స్వర్ణ పతక విజేతలకు రూ.5 కోట్లు చొప్పున ఇవ్వనున్నాయి. దిల్లీ ప్రభుత్వం బంగారు పతకాలు తెచ్చిన వారికి రూ.3 కోట్లు ఇవ్వనుంది. ఇతర దేశాలతో పోలిస్తే పతకాలు గెలిచే అథ్లెట్లకు ఇచ్చే నగదు బహుమతి భారత్లోనే అత్యధికంగా ఉండటం విశేషం.
ఇక ఇతర దేశాల విషయానికొస్తే.. బంగారు పతకం గెలిచిన క్రీడాకారులకు ఇండోనేషియా 7,46,000 డాలర్లు (రూ.5.55కోట్లు), సింగపూర్ 735,000 డాలర్లు (రూ.5.47 కోట్లు), హాంకాంగ్ 644,000 డాలర్లు (రూ.4.80కోట్లు), థాయ్లాండ్ 309,000 డాలర్లు (2.30కోట్లు), కజకిస్థాన్ 250,000 డాలర్లు (రూ.1.86కోట్లు), ఇటలీ 212,000 డాలర్లు (1.58కోట్లు) నగదు బహుమతి ప్రకటించాయి. అగ్రరాజ్యం అమెరికా పతకాలు తెచ్చేవారికి ఇచ్చే నజరానా చాలా తక్కువ. స్వర్ణం గెలిచే అమెరికన్ అథ్లెట్కు 37,500 డాలర్లు (రూ.28లక్షలు) ప్రకటించగా.. ఆతిథ్య దేశం జపాన్ 45,200 డాలర్లు (రూ.34లక్షలు) ఇవ్వనుంది. ఇక ఫ్రాన్స్ 65,000 డాలర్లు (రూ.48లక్షలు), రష్యా 61,000 డాలర్లు (రూ.45లక్షలు), బ్రెజిల్ 47,500 డాలర్లు (రూ.35లక్షలు), దక్షిణాఫ్రికా 37,000 (రూ.27.5లక్షలు) నెదర్లాండ్స్ 35,400 డాలర్లు (రూ.26లక్షలు), జర్మనీ 22,000 డాలర్లు (రూ.16లక్షలు), కెనడా 16,000 డాలర్లు (రూ.12లక్షలు), ఆస్ట్రేలియా 15,100 డాలర్లు (రూ.11లక్షలు) నజరానాగా ఇవ్వబోతున్నట్లు వెల్లడించాయి.
బ్రిటన్, నార్వే, స్వీడన్ దేశాలు మాత్రం అథ్లెట్లకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. దానికి బదులుగా ఒలింపిక్స్, పారాఒలింపిక్స్ క్రీడల కోసం ఏటా 160 మిలియన్ డాలర్లు కేటాయిస్తున్నాయి. ఈ డబ్బుతో అథ్లెట్లకు శిక్షణ, స్టైఫండ్ ఇస్తున్నారు. నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల అథ్లెట్లలో క్రీడా స్ఫూర్తి రాదని బ్రిటన్ నమ్మకం. అందుకే నజరానా ఇవ్వడానికి విముఖుత చూపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM