IND vs NZ: ఓపెనర్ల కంటే వాళ్లిద్దరే ఎక్కువ పరుగులు చేస్తారు: ఆకాశ్ చోప్రా
న్యూజిలాండ్తో జరుగనున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా ఓపెనర్ల కంటే.. అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారా జోడీ ఎక్కువ పరుగులు చేస్తుందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్తో జరుగనున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా ఓపెనర్ల కంటే.. అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారా జోడీ ఎక్కువ పరుగులు చేస్తుందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. అలాగే, న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ మెరుగ్గా రాణిస్తారని అంచనా వేశాడు. తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీతో.. రహానె కెప్టెన్గా, పుజారా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.
‘తొలిటెస్టులో టీమ్ఇండియా ఓపెనర్ల కంటే రహానె, పుజారా జోడీ ఎక్కువ పరుగులు చేస్తుందనుకుంటున్నాను. ఎందుకంటే, చాలా రోజులుగా ‘టెస్టు స్పెషలిస్ట్’ పుజారా మూడంకెల స్కోరును అందుకోలేకపోయాడు. మరోవైపు, టెస్టు జట్టులో స్థానం పదిలపరుచుకోవాలంటే రహానె తప్పని సరిగా రాణించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరుగుతున్న ఈ టెస్టులో వీరిద్దరూ మెరుగ్గా రాణిస్తారనుకుంటున్నాను. అలాగే రోహిత్ శర్మ, గాయం కారణంగా కేఎల్ రాహుల్ ఈ సిరీస్కు దూరం కావడంతో యువ ఆటగాళ్లు ఓపెనింగ్ చేయనున్నారు. వారు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. భారత స్పిన్నర్లు కచ్చితంగా పదికి పైగా వికెట్లు తీస్తారనిపిస్తోంది. న్యూజిలాండ్ జట్టులో ప్రస్తుతం కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ మంచి ఫామ్లో ఉన్నారు. తొలి టెస్టులో వారిద్దరూ కలిసి 125కి పైగా పరుగులు చేసే అవకాశం ఉంది’ అని ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ జట్టు చివరిసారిగా 1988లో టీమ్ఇండియాను సొంత గడ్డపై ఓడించిన విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్