INDvsAUS: గబ్బా టెస్టే ఫేవరెట్
ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాపై గబ్బాలో ఆడిన టెస్టే తమ కెరీర్లో అత్యంత ఇష్టమైన మ్యాచ్ అని టీమ్ఇండియా బ్యాట్స్మెన్ చెతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ పేర్కొన్నారు...
టీమ్ఇండియా బ్యాట్స్మెన్ పుజారా, పంత్
ఇంటర్నెట్డెస్క్: ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాపై గబ్బాలో ఆడిన టెస్టే తమ కెరీర్లో అత్యంత ఇష్టమైన మ్యాచ్ అని టీమ్ఇండియా బ్యాట్స్మెన్ చెతేశ్వర్ పుజారా, పంత్ పేర్కొన్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుదిపోరు సందర్భంగా పలువురు భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లను వారికి ఇష్టమైన టెస్టు మ్యాచ్, క్రికెట్ మైదానాల పేర్లు చెప్పమని అడగ్గా వీళ్లిద్దరూ ఇలా చెప్పుకొచ్చారు. తొలుత బుమ్రా స్పందిస్తూ 2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా జోహెనస్బర్గ్లో ఆడిన తన అరంగేట్రం టెస్టు మ్యాచ్ ఫేవరెట్ అని తెలిపాడు.
అనంతరం రిషభ్పంత్ స్పందిస్తూ తనకు ఇటీవల ఆస్ట్రేలియాపై గబ్బాలో ఆడి గెలిపించిన టెస్టే చాలా ఇష్టమని చెప్పాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. తాను చూసిన మ్యాచ్ల్లో 2001లో ఈడెన్గార్డెన్స్ వేదికగా భారత్ ఆస్ట్రేలియాను ఓడించిన టెస్టంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఇక ప్రత్యక్షంగా చూసిన మ్యాచ్ల్లో 1999లో పాకిస్థాన్.. భారత పర్యటన సందర్భంగా చెన్నైలో ఆడిన తొలి టెస్టు అని వెల్లడించాడు. ఆ మ్యాచ్లో భారత్ 12 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైనా సచిన్ (136) వీరోచిత పోరాటం తనకింకా గుర్తుందని చెప్పాడు. అనంతరం చెతేశ్వర్ పుజారా స్పందిస్తూ గబ్బా టెస్టునే పేర్కొన్నాడు. చివరగా ఇషాంత్ మాట్లాడుతూ 2008లో ఇంగ్లాండ్తో ఆడిన తొలి టెస్టు అని, తర్వాత 2014లో లార్డ్స్లో అదే ఇంగ్లిష్ జట్టుతో తలపడటమని వివరించాడు.
గబ్బా టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా 2-1 తేడాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సైతం కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 369 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులు చేసింది. ఇక్కడ ప్రధాన బ్యాట్స్మెన్ విఫలమైనా వాషింగ్టన్ సుందర్ (62), శార్దూల్ ఠాకూర్ (67) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం ఆసీస్ 294 పరుగులకు ఆలౌటవ్వగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 33 పరుగులు కలుపుకొని భారత్ ముందు 328 లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్గిల్ (91), రిషభ్ పంత్ (89 నాటౌట్), పుజారా (56) అర్ధశతకాలతో మెరిసి జట్టును విజయతీరాలకు చేర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు