Rahul Dravid: టీమిండియా కోచ్గా ద్రవిడ్ ఎంపిక సరైనదే: ఎమ్మెస్కే ప్రసాద్
మాజీ ఆటగాడు, ప్రస్తుత ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ను టీమిండియా కోచ్గా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్తో ముగుస్తున్న..
ఇంటర్నెట్ డెస్క్: మాజీ ఆటగాడు, ప్రస్తుత ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్ను టీమిండియా కోచ్గా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్తో ముగుస్తున్న నేపథ్యంలో.. తదుపరి కోచ్గా ద్రవిడ్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ‘టీమిండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ సరైన వ్యక్తి అని నేను గతంలోనే చెప్పాను. అతడు ఆటగాళ్లతో త్వరగా కలిసిపోగలడు. రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా మెరుగ్గా రాణించింది. ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచింది. వరుసగా విజయాలు సాధించడమంటే మామూలు విషయం కాదు. ఇక ముందు కూడా ఇదే విజయ పరంపర కొనసాగించాలంటే.. కోచ్గా రాహుల్ ద్రవిడ్ లాంటి వ్యక్తిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం’ అని ప్రసాద్ పేర్కొన్నాడు.
ఇటీవల రాహుల్ ద్రవిడ్తో చర్చలు జరిపిన బీసీసీఐ వర్గాలు.. భారత జాతీయ జట్టుకు కోచ్గా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాఠోడ్ కొనసాగే వీలుంది. ఫీల్డింగ్ కోచ్గా ఆర్.శ్రీధర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, ద్రవిడ్ పర్యవేక్షణలో చాలా మంది యువ ఆటగాళ్లు అండర్-19 స్థాయిలో మేటి ఆటగాళ్లుగా తయారైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారంతా భారత జట్టులోనూ మెరుగ్గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.