పంత్.. రూట్.. స్టోక్స్.. గరం గరం..!
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్ఇండియా 300/6 స్కోర్తో మెరుగైన స్థితిలో నిలిచింది. రోహిత్(161) భారీ శతకానికి తోడు రహానె(67) కీలక ఇన్నింగ్స్ ఆడాడు...
చెన్నై: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్ఇండియా 300/6 స్కోర్తో మెరుగైన స్థితిలో నిలిచింది. రోహిత్(161) భారీ శతకానికి తోడు రహానె(67) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రిషభ్పంత్(33) ధాటిగా ఆడి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. అయితే, శనివారం ఆట చివరి ఓవర్ సందర్భంగా పంత్.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు జోరూట్, బెన్స్టోక్స్తో మాటల యుద్ధానికి దిగాడు.
తొలి రోజు మొత్తం 88 ఓవర్ల ఆట సాగగా ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ 87వ ఓవర్ బౌలింగ్ చేశాడు. అయితే, పంత్ ఆ ఓవర్లో ఒక్కో బంతిని ఎదుర్కొనే క్రమంలో కాస్త ఆలస్యం చేశాడు. దాంతో తొలిరోజు ఆటను ఆ ఓవర్తోనే ముగిస్తారని భావించాడు. కానీ, పంత్ అనుకున్నట్లు జరగలేదు. ఆట నిలిచిపోయే సమయానికి ఇంకా ఒక నిమిషం ముందే రూట్ తన ఓవర్ను పూర్తి చేశాడు. దీంతో ఇంకో ఓవర్ ఆట సాగాల్సి వచ్చింది. బంతి అందుకున్న ఓలీస్టోన్ చివరి ఓవర్ను పూర్తి చేశాడు.
అయితే, స్టోన్ 88వ ఓవర్ వేయకముందు.. రూట్, స్టోక్స్, పంత్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తొలుత టీమ్ఇండియా బ్యాట్స్మన్, ఇంగ్లాండ్ కెప్టెన్ ఏదో అనుకోగా, తర్వాత స్టోక్స్ వచ్చి ఆజ్యం పోశాడు. దీంతో మళ్లీ పంత్, స్టోక్స్ మధ్య వాడీవేడీ సంభాషణలు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు ప్రశాంతంగా సాగిన తొలిరోజు ఆట చివర్లో ఇలాంటి పరిస్థితులకు దారి తీసింది. కాగా, చివరి ఓవర్లో పంత్ ఒక బౌండరీ బాది నాటౌట్గా నిలిచాడు. మరోవైపు అతడికి అక్షర్ పటేల్(5) తోడుగా నిలిచాడు.
ఇవీ చదవండి..
ఏమైంది రోహిత్? విరాట్ అమాయక ప్రశ్న!
రోహిత్ 97.. రితికా గుండె లబ్..డబ్!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..