Sachin: పెద్ద పులులను చూడటం అమితానందం
వణ్య మృగాలైన పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అడవుల మనుగడకు అవి కూడా కారణమని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అన్నారు. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం...
ఇంటర్నెట్డెస్క్: వన్య మృగాలైన పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అడవుల మనుగడకు అవి కూడా కారణమని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అన్నారు. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు చేసిన మాస్టర్ బ్టాస్టర్.. ఒకానొక సమయంలో తాను సందర్శించిన తబోడా-అంధేరీ టైగర్ రిజర్వ్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వాటి ఆవశ్యకతపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే పెద్ద పులులను చూడటం ఎప్పటికీ అమితానందం కలిగిస్తుందని వ్యాఖ్యానం జతచేశారు.
మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ సైతం పులుల సంరక్షణపై ఓ పోస్టు పెట్టారు. ‘అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా వన్యమృగాల ప్రేమికులకు, వాటిని సంరక్షించడానికి అంకితభావంతో పనిచేస్తున్న వారికి అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 70శాతం పులులకు నిలయమైన భారత్లో.. టైగర్-ఫ్రెండ్లీ ఇకో సిస్టమ్ వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నా’మని మోదీ ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల అంతరించిపోతున్న వన్య మృగాల్లో పులులు మొదటివరుసలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వాటిపై అవగాహన కల్పించేందుకు ఏటా జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా