సచిన్ ఆడకపోతే.. పాక్ దెబ్బకొట్టేది!
క్రికెట్ ప్రేక్షకుల్లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే సహజంగానే అమితాసక్తి నెలకొంటుంది. అలాంటిది ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లో ఇరు జట్లూ కీలకమైన సెమీ ఫైనల్స్లో తలడపడటమంటే మాటలా..!...
తెందూల్కర్కు అదృష్టం కలిసొచ్చిన వేళ భారత్ విజయం..
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్ ప్రేక్షకుల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే సహజంగానే అమితాసక్తి నెలకొంటుంది. అలాంటిది ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లో ఇరు జట్లూ కీలకమైన సెమీ ఫైనల్స్లో తలడపడటమంటే మాటలా..! ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. మరీ ముఖ్యంగా దాయాదులపై క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఆధిపత్యం చెలాయించిన వేళ.. అతడికి పలుమార్లు అదృష్టం కలిసొచ్చిన సమయాన టీమ్ఇండియా విజయం సాధించింది. అది భారత క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకమే. అది జరిగి నేటికి సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా నాటి విశేషాలు గుర్తు చేసుకుందాం..
ఇద్దరు ప్రధానుల రాక.
మొహాలి వేదికగా 2011 వన్డే ప్రపంచకప్లో మార్చి 30న భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. అది కూడా కీలకమైన సెమీస్ పోరులో. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడటానికి ఇరు దేశాల ప్రధానులు హాజరయ్యారు. అప్పటి భారత ప్రధాని మన్మోహన్సింగ్ ఆహ్వానం మేరకు పాక్ ప్రధానిగా ఉన్న యూసుఫ్ రజా గిలానీ ప్రత్యేకంగా మొహాలీకి వచ్చి మరీ మ్యాచ్ను తిలకించారు. అలాగే పాక్ నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాలావరకు టికెట్లు బ్లాక్లో అమ్ముడుపోయాయి. కీలకమైన పోరును ప్రత్యక్షంగా చూసి ఆనందించాలని నిర్ణీత ధరకన్నా మూడింతలు ఎక్కువే పెట్టి అభిమానులు కొనుగోలు చేశారు. దాంతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది.
సచిన్ ఒంటరిపోరాటం..
ఇక టాస్గెలిచి టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(38; 25 బంతుల్లో 9x4), సచిన్ (85; 115 బంతుల్లో 11x4) ఆదిలోనే దంచికొట్టారు. తొలి వికెట్కు 5.5 ఓవర్లలో 48 పరుగులు జోడించి శుభారంభం చేశారు. అదే సమయంలో సెహ్వాగ్ ఔటవ్వడంతో.. గంభీర్(27; 32 బంతుల్లో 2x4)తో కలిసి సచిన్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. రెండో వికెట్కు వీరిద్దరూ 68 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే గంభీర్, కోహ్లీ(9), యువరాజ్(0) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దాంతో టీమ్ఇండియా 25.3 ఓవర్లకు 141/4తో కష్టాల్లో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు సచిన్ ఒంటరిపోరాటం చేశాడు. ధోనీ(25; 42 బంతుల్లో 2x4)తో కలిసి ఐదో వికెట్కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, శతకానికి చేరువ అవుతున్న వేళ అజ్మల్ బౌలింగ్లో అఫ్రిది చేతికి చిక్కాడు. అప్పటికే పలుమార్లు జీవనదానం లభించిన మాస్టర్కు ఈసారి అవకాశం దక్కలేదు. జట్టు స్కోర్ 187 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అందులో సచిన్ చేసినవే 85 పరుగులున్నాయి. ఇక జట్టు స్కోర్ 200 దాటాక ధోనీ సైతం వెనుదిరిగాడు. చివర్లో రైనా(36*; 39 బంతుల్లో 3x4) కాస్త పరుగులు చేయడంతో టీమ్ఇండియా స్కోర్ 260/9గా నమోదైంది.
భయపెట్టినా తోకముడిచింది..
అప్పటి బ్యాటింగ్ లైనప్ చూస్తే పాకిస్థాన్కు 261 పరుగుల ఛేదన పెద్ద కష్టమేమీ కాదనిపించింది. దానికి తోడు ఓపెనర్లు కమ్రన్ అక్మల్(19; 21 బంతుల్లో 3x4), మహ్మద్ హఫీజ్(43; 59 బంతుల్లో 7x4) ధాటిగా ఆడి కాస్త హడలెత్తించారు. తొలి వికెట్కు 44 పరుగులు జోడించాక జహీర్.. అక్మల్ను ఔట్చేసి టీమ్ఇండియాకు వికెట్ల ఖాతా తెరిచాడు. కాసేపటికే మునాఫ్ పటేల్ అద్భుతమైన డెలివరీతో హఫీజ్ను బుట్టలో వేసుకున్నాడు. ఇక జట్టు స్కోర్ వంద దాటాక యువీ వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లు తీసి భారత్ను పోటీలోకి తెచ్చాడు. అసద్ షాఫిక్(30), యూనిస్ఖాన్(13)ను తక్కువ స్కోర్లకే పరిమితం చేశాడు. ఆపై మిస్బా ఉల్ హక్(56; 76 బంతుల్లో 5x4, 1x6) పోరాడినా మరో ఎండ్లో సహకరించే బ్యాట్స్మెన్ లేకపోయారు. మధ్యలో ఉమర్ అక్మల్(29; 24 బంతుల్లో 1x4, 2x6) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ హర్భజన్ బౌల్డ్ చేయడంతో పాక్ ఐదో వికెట్ కోల్పోయింది. అబ్దుల్ రజాక్(3), అఫ్రిది(19) విఫలమవడంతో పాక్ 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. దాంతో టీమ్ఇండియా 29 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. అలా ఫైనల్కు చేరి అక్కడ శ్రీలంకను చిత్తుచేసింది. ఈ నేపథ్యంలోనే ధోనీసేన 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండోసారి వన్డే ప్రపంచకప్ను ముద్దాడింది. ఏదేమైనా ఈ మ్యాచ్లో సచిన్ ఒంటరిపోరాటానికి తోడు భారత బౌలర్లు సమష్టిగా రాణించడం అభిమానులకు ఎప్పటికీ తీపి జ్ఞాపకమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..