ఆ నవ్వే.. నన్ను యువీ అభిమానిని చేసింది
భారత క్రికెట్లో యువరాజ్సింగ్కు విశేషమైన అభిమానగణం ఉంది. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమ్ఇండియాకు ఎన్నో ఒంటి చేతి విజయాలు అందించాడు...
మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్..
ఇంటర్నెట్డెస్క్: భారత క్రికెట్లో యువరాజ్సింగ్కు విశేషమైన అభిమానగణం ఉంది. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమ్ఇండియాకు ఎన్నో ఒంటి చేతి విజయాలు అందించాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి అత్యుత్తమ ఆటగాడికి తాను 2012లో అనుకోని పరిస్థితుల్లో అభిమానిని అయ్యానని అంటున్నాడు మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్. అప్పుడు తాను యువీని విమర్శించినా అతడు మాత్రం చిరునవ్వుతోనే ఆకట్టుకున్నాడని చెప్పాడు. తాజాగా ఓ క్రీడాఛానల్తో మాట్లాడిన మంజ్రేకర్ నాటి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
2012 టీ20 ప్రపంచకప్లో యువీకి తుది జట్టులో చోటివ్వడం తనకిష్టం లేదని మంజ్రేకర్ చెప్పాడు. అప్పటికే క్యాన్సర్ నుంచి కోలుకున్న యువరాజ్ పూర్తి ఫిట్నెస్తో లేడని, దాంతో పొట్టి ప్రపంచకప్కు ఎంపిక చేయడం సరికాదని అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశానని గుర్తుచేశాడు. అయితే భావోద్వేగ పరిస్థితుల్లో యువీని ఎంపిక చేశారన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రపంచకప్లో యువీ ఒక మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేశాడని, దాంతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడని మంజ్రేకర్ తెలిపాడు.
‘‘మ్యాచ్ అనంతరం నేను వ్యాఖ్యాతగా ట్రోఫీల బహూకరణ జరుగుతోంది. ఆ సమయంలో యువీని చూసి కాస్త ఆందోళన చెందా. అంతకుముందు నేను చేసిన వ్యాఖ్యల పట్ల అతడు అసంతృప్తితో ఉన్నాడనుకున్నా. అతడిని ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కోసం పిలిచినప్పుడు.. నన్ను చూస్తూ నవ్వుకుంటూ వచ్చాడు. అప్పుడు తనతో ‘నువ్వు ఈ జట్టులో ఉండడం కొంత మందికి ఇష్టం లేదు’’ అని చెప్పాను.
‘‘దానికి స్పందించిన యువరాజ్.. ‘అవును సర్. కొంత మంది ఇలా అన్నారని నేను కూడా విన్నా’నని చెప్పాడు. తర్వాత నన్ను చూసి నవ్వాడు. ఆ నవ్వును నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా విమర్శల్ని కూడా చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ఆ నవ్వులో ఏ మాత్రం ఎగతాళి లేదు. దాన్ని క్రీడాస్ఫూర్తితో తీసుకున్నాడు. అప్పుడు ఇంటర్వ్యూలో నాతో బాగా మాట్లాడాడు. ఆ తర్వాతే నేను యువరాజ్ను గౌరవించడం ప్రారంభించా. అతడికి అభిమానిగా మారాను’ అని మంజ్రేకర్ అసలు విషయం వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.