T20 League : అమెరికాలో తొలి ప్రొఫెషనల్ టీ20 లీగ్.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పెట్టుబడి
అమెరికా వ్యాప్తంగా క్రికెట్కూ ఆదరణ పెంచేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో తొలిసారి జరగబోయే ఫ్రొఫెషనల్ టీ20 లీగ్ అయిన ...
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా వ్యాప్తంగా క్రికెట్కూ ఆదరణ పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో తొలిసారి జరగబోయే ఫ్రొఫెషనల్ టీ20 లీగ్ అయిన మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో పెట్టుబడి పెట్టేందుకు ప్రవాస భారతీయ దిగ్గజాలు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ కూడా నిధులు అందించారు. సిరీస్ A, A1 నిధుల సేకరణ పూర్తైనట్లు అమెరికా వ్యాపారవేత్తల బృందం ప్రకటించింది. మేజర్ లీగ్ కోసం 120 మిలియన్ డాలర్ల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే తొలి రెండు సిరీస్ల కోసం 44 మిలియన్ డాలర్లను సేకరించినట్లు వెల్లడించింది. మిగతా మొత్తం (76 మిలియన్ డాలర్లు) వచ్చే ఏడాదిలోపు ఫండ్రైజింగ్ ద్వారా సేకరిస్తామన్నారు.
సిరీస్ A, సిరీస్ A1 రౌండ్ ఫండ్ రైజింగ్కు సత్య నాదెళ్ల నాయకత్వం వహించారు. ‘‘అమెరికాలో క్రికెట్ వ్యాప్తి కోసం, సదుపాయాల కల్పన కోసం ఫండ్ రైజింగ్ చేపట్టాం. దీని కోసం అత్యుత్తమ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కమిటీ పని చేసింది. ప్రపంచస్థాయి ప్రొఫెషనల్ క్రికెట్ను అతిపెద్ద స్పోర్ట్స్ మార్కెట్కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇన్వెస్టర్ గ్రూప్లో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలను నడిపించే వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. వారి మార్గదర్శకత్వంలో అమెరికాలో తొలి టీ20 లీగ్ను విజయవంతం చేస్తాం. అలానే అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లను ఇక్కడ నిర్వహించేలా ప్రయత్నిస్తాం’’ అని మేజర్ లీగ్ సహ వ్యవస్థాపకులు సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాసన్ తెలిపారు.
ఫండ్ రైజ్ ద్వారా వచ్చే 120 మిలియన్ డాలర్లను క్రికెట్ మైదానాలు, ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి భవిష్యత్తులో అమెరికా నుంచి స్టార్ క్రికెటర్లు వచ్చేలా చూస్తామని సహ వ్యవస్థాపకులు వెల్లడించారు. వచ్చే ఏడాది టీ20 లీగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ సభ్య దేశమైన అమెరికా తమ దేశంలో టీ20 క్రికెట్కు ఆదరణ పెంచేందుకు మేజర్ లీగ్ క్రికెట్ (mlc)ని పార్టనర్గా ఎంపిక చేసుకుంది. యూఎస్ఏ పురుషుల, మహిళల జట్లకు ఎంఎల్సీ మద్దతుగా నిలవనుంది. 2024లో విండీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ పోటీలకు అమెరికా కూడా కో-హోస్ట్గా ఉండనుంది. ఈ క్రమంలో వచ్చే రెండేళ్లలో తమ అమెరికాలో టీ20 క్రికెట్ వృద్ధి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సత్య నాదెళ్ల, శంతను నాయణ్ కాకుండా మాడ్రోనా వెంచర్ గ్రూప్ ఎండీ సోమ సోమసేగర్, మిల్లివేస్ వెంచర్స్ అండ్ రాకెట్షిప్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ రాజారమణ్, వెంకీ హరినారాయణ్, ఇన్ఫినిటీ కంప్యూటర్ సొల్యూషన్స్ ఛైర్మన్ జైతర్ సంజయ్ గోవిల్, మేనేజింగ్ పార్టన్ పెరోట్ జైన్ తదితరులు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పలువురు ఫండ్ అందించారు. ఏ ఇన్వెస్టర్ ఎంత ఇచ్చారనేది తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు