Saurav Ganguly: కోహ్లీకి షోకాజ్ నోటీసులుపంపాలనుకున్న గంగూలీ!
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట.
ఇంటర్నెట్డెస్క్: తన ఆటతీరుతో విరాట్ కోహ్లీ భారత జట్టును మరోస్థాయికి తీసుకెళ్లాడనంలో ఎలాంటి సందేహం లేదు. విజయవంతమైన కెప్టెన్గా కోట్ల మంది అభిమానుల మనసులు గెలుచుకున్న కోహ్లీ ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ యాజమాన్యానికి, కోహ్లీకి పొసగడం లేదని తరచూ వార్తలు వస్తున్నాయి. అందుకే కోహ్లీ కెప్టెన్సీని వదులుకున్నాడని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ అంశాలకు ఆజ్యం తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన అనంతరం.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరేముందు విలేకరుల సమావేశం నిర్వహించాడు. ఈ సమావేశంలో తనపై జరుగుతున్న ప్రచారంపై కోహ్లీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని చెబితే తననెవరూ ఆపలేదని తెలిపాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఒకానొక సందర్భంలో ఈ వ్యాఖ్యలతో ఏకీభవించని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపేందుకు సిద్ధమయ్యాడట. విలేకరుల సమావేశంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని గంగూలీ భావించాడట. అయితే షోకాజు నోటీసులు పంపేముందు గంగూలీ ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షాకు తెలిపాడట. దీంతో ఆయన ఈ విషయం పెద్దది కాకుండా గంగూలీని ఒప్పించాడట. ప్రస్తుతం ఈ వార్త మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సౌరభ్ గంగూలీతో సంబంధాలు దెబ్బతినడంతోనే విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా వైదొలిగాడా అన్న ప్రశ్నలకు షోకాజు నోటీస్ అంశం బలాన్ని చేకూరుస్తోంది.
ఏం జరిగిందంటే..
2021లో జరిగిన పొట్టి ప్రపంచకప్లో భారత జట్టు వైఫల్యం చెందడంతో కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అనంతరం బీసీసీఐ సెలక్షన్ కమిటీ కోహ్లీని వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించింది. వన్డే, టీ20లకు భిన్న సారథ్యం సరికాదన్న వాదనను బీసీసీఐ తెరపైకి తీసుకొచ్చింది. రెండు ఫార్మాట్లకు కెప్టెన్లుగా వేరువేరుగా ఉంటే జట్టుపై తీవ్రప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డేలకు కెప్టెన్గా, టెస్టులకు వైస్ కెప్టెన్గా రోహిత్ను నియమించింది. ఈ సమయంలో బీసీసీఐ నుంచి మీడియాకు కొన్ని లీకులు వెళ్లడం కోహ్లీని మనస్తాపానికి గురిచేశాయి. తనపై జరుగుతున్న ప్రచారానికి దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు విలేకరుల సమావేశంలో పలు ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. తనని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి గంటన్నర ముందు మాత్రమే సమాచారం ఇచ్చారని, టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని ఎవరూ చెప్పలేదని అన్నాడు. కెప్టెన్సీ వదులుకోవద్దంటూ కోహ్లీతో తాను మాట్లాడానని అంతకుముందు గంగూలీ చేసిన ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. అప్పట్లో కోహ్లీ ప్రకటన భారత క్రికెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఇక మూడు టెస్టుల సిరీస్లో భారత్ తొలి మ్యాచ్ గెలవగా, దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్ గెలిచింది. ఇక కీలక మూడో టెస్టుకు జట్టును ఎంపిక చేయడంలో ముసలం పుట్టినట్లు తెలిసింది. మూడో టెస్టుకు ఆజింక్య రహానెకు బదులుగా శ్రేయస్ అయ్యర్ను తుది జట్టులోకి తీసుకోవాలని కోహ్లీ సూచించినట్లు తెలిసింది. కోచ్ ద్రవిడ్ మాత్రం రహానె వైపు మొగ్గుచూపడం.. అందుకు బీసీసీఐ పెద్దలు మద్దతు పలకడంతో కోహ్లీని మనస్తాపానికి గురైనట్లు సమాచారం. జట్టు ఎంపికలో, తుది జట్టు కూర్పులో తన ప్రమేయం లేకుండా పోవడంతో కోహ్లీ మూడో టెస్ట్ అనంతరం టెస్ట్ ఫార్మాట్కు కెప్టెన్గా వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..