బుమ్రాకి కాదు.. కపిల్ దేవ్లా నిఖార్సైన ఆల్ రౌండర్కి పగ్గాలివ్వాలి: రవిశాస్త్రి
టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలనే వాదనపై మాజీ కోచ్ రవిశాస్త్రి విభేదించాడు. కపిల్ దేవ్ లాంటి నిఖార్సైన ఆల్ రౌండర్కి టెస్టు పగ్గాలు అప్పగిస్తే...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలనే వాదనపై మాజీ కోచ్ రవిశాస్త్రి విభేదించాడు. కపిల్ దేవ్ లాంటి నిఖార్సైన ఆల్ రౌండర్కి టెస్టు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలికినప్పటి నుంచి తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ టీమ్ఇండియా కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్కు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు కూడా అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో బీసీసీఐ, జట్టు యాజమాన్యం భవిష్యత్ కెప్టెన్ను కూడా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
‘బుమ్రాకు టెస్టు పగ్గాలు అప్పగించాలనడం సరికాదు. నాకెప్పుడూ అలాంటి ఆలోచనే రాలేదు. భారత జట్టులో పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. జట్టులో స్థానం కోసం ఎదురు చూసే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి, టీమ్ఇండియాలో ఫాస్ట్ బౌలర్ సుదీర్ఘ కాలం జట్టులో కొనసాగలేడు. అందుకే, ఒక పేసర్ కెప్టెన్గా వ్యవహరించడమనేది చాలా కష్టం. ఫాస్ట్ బౌలర్ కెప్టెన్గా ఉండాలంటే.. బ్యాటుతోనూ రాణించాల్సి ఉంటుంది. లేదంటే బాబ్ విల్లీస్లా ఎప్పుడూ జట్టులో ఉండే ఆటగాడైనా కావాలి. అలాంటి బౌలర్ భారత్తో దొరకడం చాలా అరుదు. ఇవేవీ కాకుంటే.. కపిల్ దేవ్, సర్ గార్ఫీల్డ్లా నిఖార్సైనా ఆల్ రౌండర్కు అయినా టీమ్ఇండియా టెస్టు పగ్గాలు అప్పగించాలి’ అని రవిశాస్త్రి సూచించాడు.
‘టీమ్ఇండియాకు నాయకత్వం వహించే అవకాశం వస్తే.. జట్టుని నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని బుమ్రా గతంలో చెప్పాడు. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో బుమ్రా వైస్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడిన బుమ్రాకు వెస్టిండీస్తో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?