Team India: గబ్బర్ సేన వచ్చేసింది..!
వచ్చేనెల శ్రీలంక పర్యటన కోసం బీసీసీఐ గతవారం శిఖర్ ధావన్ నేతృత్వంలో 20 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. వాళ్లంతా అక్కడికి వెళ్లేముందు రెండు వారాలు ముంబయిలో ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉండనున్నారు...
ముంబయి: వచ్చేనెల శ్రీలంక పర్యటన కోసం బీసీసీఐ గతవారం శిఖర్ ధావన్ నేతృత్వంలో 20 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. వాళ్లంతా అక్కడికి వెళ్లేముందు రెండు వారాలు ముంబయిలో ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం వాళ్లంతా అక్కడికి చేరుకున్నారని బీసీసీఐ ఫొటోలతో సహా ట్వీట్ చేసింది. లంక పర్యటనకు ఎంపిక చేసిన 20 మంది వచ్చారని, దాంతో అందరూ ఏకమయ్యారని సంతోషం వ్యక్తం చేసింది. కాగా, ఇప్పుడా ఆటగాళ్లంతా 14 రోజులు కఠిన క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి. అక్కడ వారికి రోజు విడిచి రోజు ఆరుసార్లు కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
మరోవైపు కోహ్లీ సారథ్యంలోని ప్రధాన భారత జట్టు ప్రస్తుతం సౌథాంప్టన్లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ మూడు రోజుల్లో న్యూజిలాండ్తో తలపడే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం సమాయత్తమవుతోంది. ఆ మ్యాచ్ తర్వాత అదే జట్టు ఆగస్టులో ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలోనే జులై నెల ఖాళీగా ఉండటంతో బీసీసీఐ లంక పర్యటనను ఖరారు చేసింది. దానికి ధావన్ నేతృత్వంలో యువ బృందాన్ని ఎంపిక చేసింది. జులై 13 నుంచి 18 వరకు మూడు వన్డేలు, ఆపై 21 నుంచి 25 వరకు మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అలాగే ఈ జట్టుకు టీమ్ఇండియా మాజీ సారథి, ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ను కోచ్గా బీసీసీఐ నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా