Virat Kohli: కోహ్లీ అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు: అక్తర్
అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొని పూర్తిస్థాయి బ్యాట్స్మెన్గా మారిన టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మద్దతుగా నిలిచాడు....
ఇంటర్నెట్డెస్క్: అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొని పూర్తిస్థాయి బ్యాట్స్మెన్గా మారిన టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మద్దతుగా నిలిచాడు. కెప్టెన్సీ విషయంలో తలెత్తిన ఇబ్బందికర పరిస్థితుల్ని పక్కనపెట్టి ఆటపై దృష్టి సారించాలని హితవు పిలికాడు. కెప్టెన్సీ అంత సులువైన విషయం కాదని.. తీవ్ర ఒత్తిడి మధ్య బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపాడు. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయని.. కేవలం క్రికెట్పైనే దృష్టి పెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నాడు.
కోహ్లీ గొప్ప ఆటగాడని.. క్రికెట్ని ఎంజాయ్ చేస్తూ ఆడగలిగితే మరింత రాణిస్తాడని అక్తర్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీ వివాదంలోనే చిక్కుకుపోకుండా వాటన్నింటినీ మరచిపోవాలని సూచించాడు. రానున్న ఆరునెలల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే.. కెప్టెన్సీని వదులుకున్నందుకు ప్రతిఫలం దక్కినట్లేనని వ్యాఖ్యానించాడు. అలాగే 120 అంతర్జాతీయ శతకాలు సాధించగలనన్న విశ్వాసం తనలో వస్తుందని చెప్పాడు.
కొహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తీరుపై అక్తర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. కోహ్లీకి వ్యతిరేకంగా కొంతమంది వ్యవహారాలు నడిపారని ఆరోపించాడు. అందుకే అతను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. క్రికెట్లో స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లకు ఇబ్బందులు తప్పవన్నాడు. దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించాడు. దేనికీ బెదరకుండా ఆటను ఆస్వాదించాలని హితవు పలికాడు. యావత్తు దేశం కోహ్లీని ప్రేమిస్తోందని గుర్తుచేశాడు! అయితే, కొన్ని సార్లు ఇటువంటి పరీక్షలు తప్పవని.. వాటి నుంచి ధైర్యంగా బయటకు రావాలని సూచించాడు.
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు జరిగిన విలేకర్ల సమావేశంలో వన్డే కెప్టెన్సీ పై విరాట్ ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీ20 సారథ్య బాధ్యతలను వదులుకోవద్దని ఎవరూ చెప్పలేదని, వన్డే కెప్టెన్గా తొలగిస్తున్నట్లు కేవలం గంటన్నర ముందు మాత్రమే సమాచారం ఇచ్చారని పేర్కొన్నాడు. కెప్టెన్సీ వదులుకోవద్దంటూ కోహ్లీతో తాను మాట్లాడానని అంతకుముందు గంగూలీ చేసిన ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధం. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఫలితంగా గంగూలీ ఒకానొక దశలో విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపేందుకు సిద్ధమయ్యాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే, బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయం పెద్దది కాకుండా ఆపాడని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గంగూలీ స్పందించడంతో వివాదానికి ముగింపు పలికినట్లైంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీకీ గుడ్బై చెప్పేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం