శార్దూల్, సిరాజ్ రచించిన గబ్బా బౌలింగ్ వ్యూహం!
బ్రిస్బేన్ టెస్టులో వికెట్కు రెండువైపులా ఒత్తిడి పెంచాలన్నది తమ ప్రణాళికని టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. ఆటకు ముందు తాను, శార్దూల్ ఠాకూర్ ఈ విషయంపై చర్చించుకున్నామని తెలిపాడు. చక్కని ప్రాంతాల్లో బంతులు వేయడంతో ఆసీస్ ఆటగాళ్లు త్వరగా ఔటయ్యారని...
ఇంటర్నెట్ డెస్క్: బ్రిస్బేన్ టెస్టులో వికెట్కు రెండువైపులా ఒత్తిడి పెంచాలన్నది తమ ప్రణాళికని టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. ఆటకు ముందు తాను, శార్దూల్ ఠాకూర్ ఈ విషయంపై చర్చించుకున్నామని తెలిపాడు. చక్కని ప్రాంతాల్లో బంతులు వేయడంతో ఆసీస్ ఆటగాళ్లు త్వరగా ఔటయ్యారని వెల్లడించాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన తెలిసిందే. కట్టుదిట్టమైన బంతులు వేసిన ఈ యువపేసర్ మొత్తంగా 13 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. రెండు, మూడో మ్యాచులో బుమ్రా సలహాలు పొందిన అతడు నాలుగో టెస్టులో ఏకంగా బౌలింగ్ దాడికే నేతృత్వం వహించాడు. సీనియర్లు గాయాల బారిన పడటంతో శార్దూల్ ఠాకూర్, నటరాజన్, సైనికి అండగా నిలిచాడు. పైగా ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. జట్టు యాజమాన్యం, అభిమానుల నమ్మకం నిలబెట్టుకున్నాడు.
‘ఆసీస్ వికెట్లు తీయాలంటే వికెట్కు రెండువైపులా ఒత్తిడి చేయాలన్నది మా వ్యూహం. బ్రిస్బేన్లో శార్దూల్, నేను కొంత సమయం కూర్చొని చర్చించుకున్నాం. ఒత్తిడి చేయాలని నిర్ణయించుకున్నాం. స్కోరు చేయలేని ప్రాంతాలను ఎంచుకొని బంతులు వేశాం. కీలక ఆటగాళ్లు లేనప్పుడు ఏ జట్టైనా కొంత ఒత్తిడికి లోనవుతుంది. గాయాల వల్ల మేమూ గొప్ప ఆటగాళ్ల సేవలు కోల్పోయాం. మా కోచింగ్, సహాయ సిబ్బంది అండతోనే మేమిలా చేయగలిగాం. వికెట్కు రెండు వైపులా కట్టుదిట్టమైన బంతులతో ఒత్తిడి పెంచితే బ్యాట్స్మన్ కచ్చితంగా తప్పులు చేస్తారు. ఇక్కడా అదే జరిగింది. మేం ఉక్కిరిబిక్కిరి చేశాం. ఆస్ట్రేలియా ఆటగాళ్లు వికెట్లు ఇచ్చారు’ అని సిరాజ్ అన్నాడు.
గాయపడ్డా బౌలింగ్కు దిగిన సైని, అరంగేట్రంలోనే అదరగొట్టిన నటరాజన్ను సిరాజ్ ప్రశంసించాడు. ‘అరంగేట్రం మ్యాచు కావడంతో మేం గెలిచిన ట్రోఫీని నటరాజన్కు ఇవ్వాలని అజింక్య రహానె, రవిశాస్త్రి నిర్ణయించారు. నట్టూ నెట్ బౌలర్గా వచ్చాడు. టీ20, వన్డే, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతడో గొప్ప బౌలర్. ప్రశాంతంగా ఉంటాడు. అతిగా మాట్లాడడు. తన పనేంటో తెలుసు. అతడు నమ్మశక్యం కాని యార్కర్లు వేయగలడు’ అని సిరాజ్ తెలిపాడు.
ఇవీ చదవండి
పంత్ను ఆటపట్టించిన చాహల్, రషీద్
కుంబ్లేను ఎదుర్కోడానికి ద్రవిడ్ సాయం: తైబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి