దాదా ఢీ.. కోహ్లీ ఢీ++.. మహీ కూల్
ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నా నాయకుడు బాగాలేకుంటే ఆ జట్టు విజయాల బాటలో నడవడం కష్టం. సమష్టి తత్వం రావాలన్నా.. వ్యూహాలు రచించాలన్నా.. వాటిని పక్కాగా అమలు చేయాలన్నా.....
ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి.. ఎవరికి వారే మేటి
ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నా నాయకుడు బాగాలేకుంటే ఆ జట్టు విజయాల బాటలో నడవడం కష్టం. సమష్టి తత్వం రావాలన్నా.. వ్యూహాలు రచించాలన్నా.. వాటిని పక్కాగా అమలు చేయాలన్నా.. ప్రత్యర్థి విసిరే సవాళ్లను దాటాలన్నా.. జట్టు సభ్యుల బలాలను వెలికితీయాలన్నా సారథి అత్యంత కీలకం. అందుకే క్రికెట్లో అతడికి అంత ప్రాధాన్యం.
అంతర్జాతీయ క్రికెట్లో పెద్దన్నగా ఎదిగిన దేశం మనది. టీమ్ఇండియా ఇప్పుడీ స్థాయికి రావడానికి ఎందరో నాయకులు కష్టపడ్డారు. భారత్కు తొలిసారి ప్రపంచకప్ అందించింది కపిల్ దేవ్ అయినా ఎక్కువగా చర్చకు వచ్చేది మాత్రం సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ గురించే. ఈ లాక్డౌన్ సమయంలో వారి నాయకత్వ శైలి, విశేషాల గురించి మరొక్కసారి గుర్తు చేసుకుందాం!
సందర్భాలు వేరు
క్రికెట్లో పగ్గాలు చేపట్టడం తేలికైన విషయమేం కాదు. నాయకత్వ మార్పిడి సులభం కాదు. అతడి గుణగణాలను పరిశీలించాలి. సమష్టితత్వం సాధించగలడా చూడాలి. నడిపించే శైలినీ గమనించాలి. వీటికి తోడు సారథ్యం అప్పగించే కాలమూ ముఖ్యమే. మ్యాచ్ ఫిక్సింగ్ కళంకంతో భారత క్రికెట్ చిమ్మచీకట్లోకి వెళ్లిన కాలమది. అప్పట్లో నాయకత్వం కత్తిమీద సామే. ఆటగాళ్లు ఆత్మవిశ్వాస లోపంతో బాధపడుతున్నప్పుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ చేపట్టాడు. గ్రెగ్ ఛాపెల్ కోచింగ్లో జరిగిన నష్టం అపారం. కుంబ్లే, ద్రవిడ్ నుంచి ఎంఎస్ ధోనీ పగ్గాలు అందుకున్నాడు. 2014 ఆసీస్ పర్యటనలో కోహ్లీ టెస్టు బాధ్యతలు స్వీకరించాడు. మరికొన్నాళ్లకే పరిమిత ఓవర్ల క్రికెట్ నాయకత్వం చేపట్టాడు.
భిన్నమైన శైలి
అంతర్జాతీయ క్రికెట్లో ఒక్కో నాయకుడిది ఒక్కో శైలి. దాదా, మహీ, కోహ్లీ నాయకత్వ శైలులు సైతం భిన్నమైనవే. 1990 నుంచి ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం అందరికీ తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్లూ అలాగే ఉండేవారు. ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించేవారు. ఆంగ్లేయుల పొగరూ తక్కువేం కాదు. అలాంటి జట్లను గట్టిగా ఎదుర్కొన్న సారథి గంగూలీ. భారత క్రికెట్కు దూకుడును పరిచయం చేశాడు. ఢీ.. అంటే ఢీ అనేవాడు. ఆసీస్ సారథినే టాస్ కోసం ఎదురుచూసేలా చేశాడు. అటు యువకులు ఇటు సీనియర్లతో పటిష్టమైన జట్టును నిర్మించాడు. యువకుల కోసం తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకున్నాడు. ఇక ఎంఎస్ ధోనీ ప్రశాంతతకు మారుపేరు. ప్రత్యర్థికి తన ఆలోచనలు తెలియకుండా జాగ్రత్తపడేవాడు. పక్కగా వ్యూహాలు రచించి అమలు చేసేవాడు. కొన్ని సందర్భాల్లో జట్టు గెలిచినా సంబరాలు చేసుకోకుండా అవతలి జట్టు ఆలోచనలను ప్రభావితం చేసేవాడు. ఇక కోహ్లీ భావోద్వేగాలు ప్రదర్శించడంలో మేటి. అవసరమైతే సీనియర్ల సలహాలూ బహిరంగంగానే తీసుకుంటాడు. ప్రత్యర్థి కవ్విస్తే మాత్రం ఢీ కాదు ఢీ++ అంటాడు! ప్రతిసారీ జట్టు మార్చడం అతడికో అలవాటు.
మధుర విజయాలు
టీమ్ఇండియాకు ఈ నాయక త్రయం అందించిన విజయాలు అపూర్వం! దాదా నాయకత్వం చేపట్టిన తొలినాళ్లలో జట్టు గెలిచినా.. ఓడినా మ్యాచ్ ఫిక్సింగ్ కామెంట్లు వినిపించేవి. అలాంటి వ్యాఖ్యలు మళ్లీ వినిపించకుండా చేసింది 2001 ఆస్ట్రేలియా సిరీస్. వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, హర్భజన్ మెరుపులతో భారత్ తన చరిత్రలోనే అద్భుతమైన విజయం అందుకుంది. ఇంగ్లాండ్పై నాట్వెస్ట్ సిరీస్ గెలుపూ మధురమే. 2003 ప్రపంచకప్లో భారత్ రన్నరప్గా నిలవడమూ దాదా ఘనతే. ఇక ఆసీస్, న్యూజిలాండ్, పాక్, దక్షిణాఫ్రికా వంటిదేశాల్లో దాదాసేన టెస్టు విజయాలు అందుకొంది. ఇక ఎంఎస్ ధోనీ విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! అతడు సాధించనిది ఏముంది! ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్లు, ఛాంపియన్స్ ట్రోపీ, ఆసియా కప్లు అందించాడు. విరాట్ కోహ్లీ సైతం గత జట్లు సాధించలేని రికార్డులు నెలకొల్పాడు. శ్రీలంకపై విజయాలు.. ఆస్ట్రేలియాలో ఆసీస్ను మట్టికరిపించడం.. స్వదేశంలో వరుస టెస్టు సిరీసులు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్గా నిలిపాడు. 2019 ప్రపంచకప్లో సెమీస్కు తీసుకెళ్లాడు.
గణాంకాలూ మేటి
దాదా, ధోనీ, కోహ్లీ కెప్టెన్సీ గణాంకాలు వారి తరాల్లో గొప్పవే. గంగూలీ 424 అంతర్జాతీయ మ్యాచులాడి 41.46 సగటుతో 18,575 పరుగులు సాధించాడు. నాయకుడిగా 196 మ్యాచుల్లో 38.32 సగటుతో 7,665 పరుగులు చేశాడు. 49 టెస్టులకు నాయకత్వం వహించి 21 గెలిపించాడు. 13 ఓడాడు. వరుసగా 33 టెస్టులకు సారథ్యం వహించిన రికార్డు దాదా సొంతం. మహీ 3 ఫార్మాట్లలో 538 మ్యాచులాడి 44.96 సగటుతో 17,266 పరుగులు చేశాడు. కెప్టెన్గా 332 మ్యాచుల్లో 46.89 సగటుతో 11,207 పరుగులు సాధించాడు. 60 టెస్టులకు సారథ్యం వహించి 27 మ్యాచులు గెలిపించాడు. 18 ఓడాడు. వరుసగా 27 టెస్టులకు నాయకత్వం వహించడం గమనార్హం. ఇక విరాట్ మొత్తం 435 మ్యాచులాడి 55.78 సగటుతో 22818 పరుగులు చేశాడు. కెప్టెన్గా 200 మ్యాచులాడి 62.33 సగటుతో 12,343 పరుగులు అందుకున్నాడు. 60 టెస్టుల్లో సారథ్యం వహించి 36 గెలిపించాడు. 14 ఓడాడు. టెస్టుల్లో టీమ్ఇండియా తరఫున ఇదే అత్యుత్తమ రికార్డు. వరుసగా 25 టెస్టుల్లో సారథ్యం వహించాడు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.