సాధనలో ఆటగాళ్లు.. సానియాకు శుభాకాంక్షల వెల్లువ
ఆస్ట్రేలియాతో పోరుకు భారత ఆటగాళ్లు సాధన మొదలుపెట్టారు. నెట్స్లో విపరీతంగా శ్రమిస్తున్నారు. రవిచంద్రన్ అశ్విన్, నటరాజన్ బౌలింగ్ చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు టెన్నిస్ స్టార్ సానియా
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాతో పోరుకు భారత ఆటగాళ్లు సాధన మొదలుపెట్టారు. నెట్స్లో విపరీతంగా శ్రమిస్తున్నారు. రవిచంద్రన్ అశ్విన్, నటరాజన్ బౌలింగ్ చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులు, అభిమానులు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాంటి క్రీడాకారుల ఆసక్తికర పోస్టులు మీ కోసం..
* నెట్స్లో బౌలింగ్ చేస్తున్న నటరాజన్ వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘‘ఐపీఎల్లో విజయవంతమైన నటరాజన్ను చూశాం. ఇప్పుడు టీమిండియాకు తొలిసారిగా ఎంపికై అతడు నెట్స్లో సాధన చేస్తున్నాడు. అతడి కల నిజమైంది’’ అని వ్యాఖ్య జత చేసింది. దీన్ని బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ రీట్వీట్ చేశాడు. నటరాజన్ది స్ఫూర్తిదాయక ప్రయాణమని అన్నాడు.
* అశ్విన్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. బౌలింగ్ చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. మయాంక్ అగర్వాల్ కూడా తన చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ‘‘నీలిరంగు జెర్సీ ధరించినప్పుడు కలిగే భావన వివరించలేనిది. వచ్చే మూడు నెలలు కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’’ అని మయాంక్ దానికి వ్యాఖ్య జత చేశాడు.
* టీమిండియా శారీరక కసరత్తులు చేస్తోంది. పోటీలు నిర్వహించి ఫిట్నెస్ను పొందుతున్నారు. మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్, మనీష్ పాండే ప్లాక్ ఛాలెంజ్ చేస్తున్న ఫొటోని బీసీసీఐ పోస్ట్ చేసింది.
* బెంగాలీ నట దిగ్గజం సౌమిత్ర ఛటర్జీ మరణవార్త యావత్తు భారతదేశాన్ని విషాదంలో ముంచెత్తింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. సౌమిత్ర మరణంపై బీసీసీఐ అధ్యక్షుడు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘మీరు ఎంతో చేశారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని గంగూలీ ట్వీట్ చేశాడు.
* సానియా మీర్జాకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మిర్చి మమ్మీ సానియాకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు ‘ఏస్’లా కలిసిరావాలని కోరుకుంటున్నా’’ అని యువరాజ్ ట్వీట్ చేశాడు. టెన్నిస్లో ఏస్ సర్వీస్ షాట్ అందరికీ తెలిసిందే. ప్రత్యర్థికి బంతి అందకుండా ఆడే షాట్ ఇది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!