Axar Patel : బేసిక్స్కు కట్టుబడ్డా.. ఫలితం సాధించా: అక్షర్ పటేల్
కాన్పూర్ వేదికగా కివీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిక్యం సాధించడంలో...
ఇంటర్నెట్ డెస్క్: కాన్పూర్ వేదికగా కివీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిక్యం సాధించడంలో అక్షర్ పటేల్ (5/62) కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో న్యూజిలాండ్ను 296 పరుగులకే టీమ్ఇండియా కట్టడి చేయగలిగింది. ఈ సందర్భంగా తన ప్రదర్శనపై అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘ఆరంభం ఈ విధంగా ఉండాలని భావించా. టెస్టు క్రికెట్ అంత సులభం కాదు. ఇవాళ చాలా కష్టమైన రోజు. ఎందుకంటే నిన్న కివీస్ ఎలాంటి వికెట్ కోల్పోకుండా మూడో రోజు ఆటను ప్రారంభించింది. అప్పటికే ఓపెనర్లు క్రీజ్లో కుదురుకుని పోయారు. ఇలాంటి సందర్భంలో ప్రతి బంతికి వికెట్ తీద్దామని కాకుండా ఓపిగ్గా బౌలింగ్ చేయాలని జట్టు సభ్యులం మాట్లాడుకున్నాం. నా బేసిక్స్కు కట్టుబడి బౌలింగ్ చేశా. అంతేకాకుండా క్రీజ్ను కూడా అనుకూలంగా మార్చుకుని ఉపయోగించుకోవడంతో వికెట్లు దక్కాయి. ట్రాక్ ఎంతో నెమ్మదించింది. ఇవాళ టర్న్ అవుతోంది. అప్పుడప్పుడు బౌన్స్ కూడా అవుతోంది. దాన్ని వినియోగించుకుని రౌండ్ ఆర్మ్ డెలివరీలు సంధించా. అయితే క్రీజ్లో బ్యాటర్లు కుదురుకుంటే మాత్రం పరుగులు వస్తాయని ఇప్పటికీ నమ్ముతున్నా’’ అని అక్షర్ పేర్కొన్నాడు.
కీపింగ్లో చురుగ్గా వ్యవహరించిన భరత్
వృద్ధిమాన్ సాహా స్థానంలో కీపింగ్కు వచ్చిన కేఎస్ భరత్ తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. కివీస్ ఓపెనర్లు లేథమ్ (95), విల్ యంగ్ (89), రాస్ టేలర్ (11) ఔట్లో భరత్ కీలక పాత్ర పోషించాడు. మరీ ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్లో విల్ యంగ్ క్యాచ్ను అందుకున్న భరత్.. టీమ్ఇండియా అభిమానుల్లో సంతోషాన్ని నింపాడు. అశ్విన్ బంతిని కట్ చేయబోయిన విల్ యంగ్ బ్యాట్కు ఎడ్జ్ తీసుకుంది. అయితే అంపైర్ నాటౌట్ ప్రకటించాడు. వెంటనే కీపర్ భరత్ డీఆర్ఎస్కు వెళ్లాలని కెప్టెన్ రహానె, బౌలర్ అశ్విన్కు సూచించాడు. డీఆర్ఎస్కు వెళ్లిన భారత్కు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. విల్ యంగ్ బ్యాట్కు ఎడ్జ్ తీసుకున్నట్లు తేలడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అలానే సెంచరీకి చేరువైన లేథమ్ను భరత్ స్టంప్ ఔట్ చేశాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?