IND vs SA : ఆ సమయంలో కేఎల్ రాహుల్ వ్యూహాలేంటో అర్థం కాలేదు: గావస్కర్
తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్లను కట్టడి చేయడంలో...
ఇంటర్నెట్ డెస్క్: తొలి వన్డేలో దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్లను కట్టడి చేయడంలో సరైన ప్రణాళికలను కెప్టెన్ కేఎల్ రాహుల్ అమలు చేయలేదని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. సఫారీల జట్టు సారథి టెంబా బవుమా- డస్సెన్ జంట 204 పరుగులను జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలను నమోదు చేశారు. ప్రమాదకరంగా మారిన భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు బుమ్రా, భువనేశ్వర్తో ఎక్కువ ఓవర్లు వేయిస్తే బాగుండేదని గావస్కర్ విశ్లేషించాడు. అంతేకాకుండా వెంకటేశ్ అయ్యర్తో బౌలింగ్ చేయించాల్సిందని పేర్కొన్నాడు. దీని కోసం కేఎల్ రాహుల్ ఆలోచనల్లో కూరుకుపోయినట్లుగా ఉందని తెలిపాడు.
‘‘ప్రత్యర్థి జట్టు నుంచి మంచి భాగస్వామ్యం నమోదైనప్పుడు.. ఎలాంటి కెప్టెన్కైనా ఆలోచించడం కష్టమే. తొలి వన్డేలో ఏం జరింగిందో అర్థమైంది. ఆ మైదానం బ్యాటింగ్కు అనుకూలం. బ్యాట్ మీదకు బంతి చాలా సులువుగా వచ్చింది. అయితే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్లు భారత్ సొంతం. బుమ్రా, భువనేశ్వర్కు కనీసం ఐదారు ఓవర్లు ఉంచాల్సింది. భారీ స్కోరు సాధించకుండా ఆతిథ్య జట్టును అడ్డుకునేందుకు రాహుల్ వద్ద ఉన్న వ్యూహాలు ఏంటో కూడా తెలియలేదు. అంతర్జాతీయ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. కాబట్టి వచ్చే మ్యాచ్ల్లో జట్టును విజయవంతంగా నడిపిస్తాడని ఆశిద్దాం’’ అని సునిల్ గావస్కర్ వివరించాడు.
దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ (79) చక్కని ఇన్నింగ్స్ ఆడాడని గావస్కర్ అభినందించాడు. ‘‘ధావన్ విషయానికొస్తే.. 50 ఓవర్ల గేమ్లో నిలకడగా పరుగులు చేస్తుంటాడు. పొట్టి ఫార్మాట్లో అంతగా రాణించలేడు. అందుకే రన్స్ చేసేంతవరకు బ్యాక్గ్రౌండ్ను హోల్డ్లో పెట్టేయాల్సిందే. ఇక అతడి వయస్సు, ఫిట్నెస్ వంటి వాటిపై మాట్లాడకూడదు’’ అని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.