Sushil Kumar: అరెస్టు ఎందుకంటే..?
భారత్కు స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒలింపిక్స్లో వ్యక్తిగతంగా వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడు..
* సుశీల్ కెరీర్ను కూల్చిన అద్దె వివాదం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒలింపిక్స్లో వ్యక్తిగతంగా వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడు.. దేశంలో అతడిని వరించని క్రీడా పురస్కారం లేదు.. ఎంతోమంది యువకులు అతడిని చూసి పహిల్వాన్ అవ్వాలని జిమ్లలో చేరారు. అలాంటి వ్యక్తి తన శిష్యుడినే హత్య చేశాడనే ఆరోపణలపై కొన్నాళ్లపాటు పరారయ్యాడు.. అతడిపై పోలీసులు రూ.లక్ష రివార్డు కూడా ప్రకటించారు. ఎట్టకేలకు పోలీసులకు దొరికి జైలుపాలయ్యాడు. అతడే రెజ్లింగ్ ఛాంపియన్ సుశీల్కుమార్..!
ఇంటి అద్దె గొడవ..
సుశీల్ కుమార్కు దిల్లీలోని మోడల్ టౌన్లో ఒక ఇల్లు ఉంది. దానిలో రెజ్లర్ సాగర్ కుమార్ ధన్కర్ కొన్నాళ్లు అద్దెకు ఉన్నాడు. ఈ క్రమంలో అతను అద్దె సరైన సమయానికి చెల్లించలేదు. దీంతో సుశీల్, అతనికి మధ్య వివాదం చోటు చేసుకొంది. అప్పట్లో సాగర్ను ఖాళీ చేయించడానికి సుశీల్ తీవ్రంగా ప్రయత్నించాడు. దీనికి అతడి బంధువు ఆనంద్ అనే వ్యక్తి కూడా సాయం చేశాడు. దీంతో సాగర్ నాలుగు నెలల క్రితం ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే చోటుకు మారిపోయాడు. ఆ తర్వాత నుంచి సుశీల్ కుమార్ను సాగర్ అందరి ఎదుట దూషించడం మొదలుపెట్టాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో తన ప్రతిష్ఠ దెబ్బతింటోందని సుశీల్ ఆగ్రహం చెందాడు.
స్టేడియం వద్ద ఘర్షణ..
మే 4వ తేదీ అర్ధరాత్రి ఛెత్రసాల్ స్టేడియం వద్ద సుశీల్, ఆయన బృందం హాకీ బ్యాట్లు, క్రికెట్ బ్యాట్లతో తమపై దాడి చేసిందని క్షతగాత్రుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి సమయంలో సుశీల్ అక్కడే ఉన్నారని చెప్పారు. వారి కార్లలో హాకీ బ్యాట్లు, క్రికెట్ బ్యాట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో స్టేడియంలో అథ్లెట్లు ఉన్నట్లు సమాచారం. దాడి అనంతరం రాత్రి 2 గంటల సమయంలో సుశీల్ కుమారే పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి స్టేడియం వద్ద ఘర్షణ జరిగినట్లు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఐదుకార్లు ఆపి ఉన్నాయి. వాటిల్లో ఉన్న ఒక స్కార్పియో కారులో తూటాలు నింపి ఉన్న డబుల్ బ్యారెల్ గన్, మూడు కార్ట్రెడ్జ్లు దొరికాయి. ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలతో పడిపోయి ఉన్నారు. వారిలో సాగర్ చికిత్స పొందుతూ మరణించాడు. సుశీల్ బృందం చేసిన దాడిలో సోను మోనల్, అమిత్ కుమార్ అనే వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరు సుశీల్ కుమార్ పై ఆరోపణలు చేశారని డీసీపీ జి.ఎస్.సిద్ధు తెలిపారు. ఈ దాడిలో దాదాపు 20 మంది పాల్గొన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ప్రిన్స్ దలాల్ అనే రెజ్లర్ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు. అతడి ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
సాగర్ ఎవరు..?
సాగర్ ధన్కర్ హరియాణాలోని సోనిపట్కు చెందిన యువకుడు. అతడు సుశీల్ విజయాలను చూసి.. స్ఫూర్తి పొంది రెజ్లర్గా మారాడు. దాదాపు 8 ఏళ్ల పాటు దిల్లీలోని ఛెత్రసాల్ స్టేడియంలో శిక్షణ పొందాడు. 23 ఏళ్ల సాగర్ కూడా రోమన్స్టైల్ రెజ్లింగ్లో 97 కిలోల విభాగంలో జూనియర్ నేషనల్ ఛాంపియన్. సాగర్.. సుశీల్ కుమార్ను తన గరువుగా భావిస్తాడని అతడి తండ్రి అశోక్ ధన్కర్ మీడియా ఎదుట చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు. అశోక్ దిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు.
సుశీల్ కుమార్ స్వయంగా సాగర్, సోను, అమిత్లను బలవంతంగా కారులో ఎక్కించుకొని ఛెత్రసాల్ స్టేడియానికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ ఉన్న అనుచరుల సాయంతో దాడి చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు మొబైల్లో చిత్రీకరించిన వీడియో పోలీసులకు లభించినట్లు సమాచారం. గాయపడిన సాగర్ 5వ తేదీన మరణించాడు. అప్పటి నుంచి సుశీల్ కుమార్ అదృశ్యం అయిపోయాడు. ఈ విషయం పోలీసులకు అనుమానం పెంచింది. తొలుత ఓ బాబా ఆశ్రమంలో దాక్కొన్నట్లు సమాచారం లభించడంతో అక్కడ తనిఖీలు చేశారు. ఆ తర్వాత సుశీల్ కారులో ప్రయాణిస్తున్న ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది.
సుశీల్ ప్రతిష్ఠ దెబ్బతింది ఇలా..
ఇండియన్ రైల్వేస్లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్గా పనిచేస్తున్న సుశీల్ కుమార్ను కొన్నాళ్ల క్రితం ఛెత్రసాల్ స్టేడియానికి ఓఎస్డీగా నియమించారు. ది స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడు కూడా. ఈ ఫెడరేషన్కు గుర్తింపులేదు. ఇక స్టేడియం ఇన్ఛార్జి సత్పాల్ స్వయాన సుశీల్ కుమార్కు మావయ్య. దీంతో సుశీల్ మాటకు స్టేడియంలో ఎదురులేదు. 2012 ఒలింపిక్స్ తర్వాత సుశీల్ చాలా వ్యాపారాలను మొదలుపెట్టారు. ఒక దశలో దిల్లీ చుట్టుపక్కల టోల్ప్లాజాల కాంట్రాక్టులు అత్యధికంగా అతడికే దక్కాయి. దీంతో పాటు ఆయన చెడు స్నేహాలకు అలవాటు పడినట్లు కథనాలు వెలువడ్డాయి. కొన్నేళ్ల క్రితం సుశీల్ అనుచరులు పర్వీన్ రాణా అనే రెజ్లర్ పై దాడి చేశారు. ఈ ఘటనలో సుశీల్ నేరుగా పాల్గొనలేదు. నర్సింగ్ యాదవ్ అనే రెజ్లర్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి సస్పెండ్ కావడం వెనుక సుశీల్ హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి